Manchu manoj: నారా లోకేష్ ను కలిసిన మంచు మనోజ్ దంపతులు..

Manchu manoj: ఏపీ మంత్రి నారా లోకేశ్‌ను సినీ నటుడు మంచు మనోజ్ తన భార్య మౌనికతో వెళ్లి కలిశారు. నారావారిపల్లెలో లోకేశ్‌తో సమావేశమైన తర్వాత, మనోజ్ దంపతులు రంగంపేటకు వెళ్లి జల్లికట్టు పోటీలను వీక్షించనున్నారు.

ఇదే సమయంలో, ఈ ఉదయం మోహన్ బాబు యూనివర్శిటీ వద్ద ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్నాయి. యూనివర్శిటీ నుంచి నారావారిపల్లె వరకు మంచు విష్ణు, మంచు మనోజ్ ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. అయితే, మనోజ్ ఫ్లెక్సీలను నిన్ననే తొలగించడంతో వివాదం ఏర్పడింది. సుమారు వందకు పైగా ఫ్లెక్సీలను తీసేయడంతో, ఈ అంశం చర్చనీయాంశమైంది.

ఈ ఉదయం మనోజ్ యూనివర్శిటీకి రానున్నారనే సమాచారంతో పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారింది. యూనివర్శిటీ వద్దకు చేరుకున్న మంచు మనోజ్‌ను పోలీసులు అడ్డగించారు. కుటుంబ వివాదంపై న్యాయస్థానంలో కేసు ఉన్నందున లోపలకు అనుమతి లేదని పోలీసులు స్పష్టం చేశారు. అంతేకాక, ఈ విషయంపై మనోజ్‌కు నోటీసులు జారీ చేసినట్లు తెలిపారు.

ఈ ఘటనల నేపథ్యంలో మనోజ్ యూనివర్శిటీ వద్ద నుంచి వెనుదిరిగి నేరుగా నారావారిపల్లెకు వెళ్లిపోయారు. మంచు కుటుంబ విభేదాలు మరోసారి జనంలో చర్చనీయాంశంగా మారాయి.

 

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *