Mallikarjun kharge : బీజేపీ ఉగ్రవాదుల పార్టీ

బీజేపీ పార్టీపై విమర్శలు చేశారు కాంగ్రెస్ జాతీయ అధ్యక్షులు ఖర్గే. బీజేపీ ఉగ్రవాదుల పార్టీ అని విమర్శించారు. కాంగ్రెస్ పార్టీని అర్బన్ నక్సల్స్ వెనుకుండి నడిపిస్తున్నారంటూ మోడీ ఎప్పుడూ కాంగ్రెస్‌ను అర్బన్ నక్సల్ పార్టీగా ముద్ర వేస్తారని.. అభ్యుదయవాదులను అర్బన్ నక్సల్స్ అని పిలవడం ఆయనకు అలవాటేనని అన్నారు.

బీజేపీ అధికారంలో ఉన్న చోట్ల ఆపార్టీ నేతలు ఎస్సీ, ఎస్టీలు, మైనార్టీలపై హింసకు మద్దతు ఇస్తున్నారని ఆరోపించారు. హర్యానాలో ఏం జరిగినా.. ఆ ఘటనకు సంబంధించి సమావేశం నిర్వహిస్తున్నామని చెప్పారు. ఈ విషయంలో పార్టీ నివేదిక రాగానే ఏం చేయాలో, ఎలా జరిగిందో తెలుస్తుందన్నారు. దేశ ప్రజలతో పాటు బీజేపీ కూడా హర్యానాలో కాంగ్రెస్ పార్టీనే గెలుస్తుందని భావించింది. కానీ కాంగ్రెస్‌ ఓడిపోయేలా చేసిన అంశాలు ఏంటి? అనేది చర్చస్తామని ఖర్గే తెలిపారు.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *