Ap news: ఆంధ్రప్రదేశ్లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది.ఈ ప్రమాదంలో నలుగురు అక్కడికక్కడే మృతి చెందారు. వివరాల్లోకి వెళ్తే పల్నాడు జిల్లా బ్రాహ్మణపల్లి సమీపంలో, అద్దంకి-నార్కట్పల్లి హైవేపై గీతికా స్కూల్ వద్ద కారు అదుపుతప్పి చెట్టుకు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో నలుగురు అక్కడికక్కడే మృతి చెందారు, మరో నలుగురికి తీవ్రగాయాలయ్యాయి. యాక్సిడెంట్ పై స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనాస్థలికి చేరుకుని పిడుగురాళ్ల ఆసుపత్రికి తరలించారు.
మృతులు నెల్లూరు జిల్లా, కావలి మండలం సిరిపురానికి చెందిన తుళ్లూరు సురేశ్, వనిత, యోగులు, వెంకటేశ్వర్లుగా గుర్తించబడ్డారు. కొత్త కారుకు పూజలు చేయించుకోవాలని కొండగట్టు ఆంజనేయస్వామి ఆలయానికి వెళ్ళొస్తున్న క్రమంలో యాల్సిడెంట్ జరిగిందని పోలీసులు తెలిపారు. ప్రమాదానికి కారణంగా అతివేగం ఉన్నట్లు పోలీసులు భావిస్తున్నారు. ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.