AP news: ఏపీ ఉన్నత మండలి చైర్మన్ గా మధు మూర్తి

AP news: ఆంధ్ర ప్రదేశ్ ఉన్నత విద్యామండలి ఛైర్మన్‌గా ప్రొఫెసర్ మధుమూర్తి నియమితులయ్యారు. ఈ పదవిలో ఆయన మూడు సంవత్సరాల పాటు కొనసాగనున్నారు. ఈ విషయాన్ని విద్యా శాఖ కార్యదర్శి కోన శశిధర్ శనివారం అధికారికంగా ఉత్తర్వుల ద్వారా ప్రకటించారు.

ప్రొఫెసర్ మధుమూర్తి ప్రస్తుతం వరంగల్ ఎన్ఐటీ బోర్డ్ ఆఫ్ గవర్నర్స్ సభ్యుడిగా ఉన్నారు. గుంటూరు జిల్లా తెనాలి మండలం జాగర్లమూడికి చెందిన మధుమూర్తి విశాఖపట్నంలో విద్యను అభ్యసించారు. ప్రస్తుతం హనుమకొండలో నివసిస్తున్నారు.

గతంలో ఛైర్మన్‌గా ఉన్న హేమచంద్రారెడ్డి ఎన్నికల ఫలితాలు వచ్చిన రోజే తన పదవికి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. అప్పటి నుంచి ఈ పోస్టు ఖాళీగా ఉండగా, వైస్ ఛైర్మన్ రామమోహన్ రావు ఇన్‌ఛార్జిగా కొనసాగుతున్నారు.

 

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *