Air Crash

Air Crash:టర్కీలో ఘోర విమాన ప్రమాదం.. లిబియా సైన్యాధ్యక్షుడు సహా ఎనిమిది మంది మృతి!

Air Crash: టర్కీలో మంగళవారం రాత్రి జరిగిన భారీ విమాన ప్రమాదం అంతర్జాతీయంగా తీవ్ర కలకలం రేపింది. టర్కీ-లిబియా దేశాల మధ్య కీలక చర్చలు ముగించుకుని తిరిగి వెళ్తుండగా, లిబియా సైన్యాధ్యక్షుడు జనరల్ ముహమ్మద్ అలీ అహ్మద్ అల్-హద్దాద్ ప్రయాణిస్తున్న ప్రైవేట్ జెట్ కూలిపోయింది. ఈ విషాద ఘటనలో జనరల్ అలీతో పాటు మొత్తం ఎనిమిది మంది ప్రాణాలు కోల్పోయారు.

ఏం జరిగింది?

టర్కీ రాజధాని అంకారా నుంచి లిబియాకు బయలుదేరిన ఫాల్కన్ 50 (Falcon 50) బిజినెస్ జెట్, టేకాఫ్ అయిన కొద్దిసేపటికే ప్రమాదానికి గురైంది. విమానాశ్రయం నుంచి బయలుదేరిన 42 నిమిషాల తర్వాత ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్‌తో సంబంధాలు తెగిపోయాయి. అధికారులు గాలింపు చేపట్టగా, అంకారాకు దక్షిణాన సుమారు 70 కిలోమీటర్ల దూరంలోని హేమనా ప్రాంతంలో విమాన శిథిలాలను గుర్తించారు.

ఇది కూడా చదవండి: Woorkeri Raman: గిల్‌ను తప్పించడంలో అతని తప్పు ఏమీ లేదు

మృతుల వివరాలు

ఈ విమానంలో ప్రయాణిస్తున్న ఎవరూ ప్రాణాలతో బయటపడలేదని అధికారులు ధృవీకరించారు. మృతుల్లో:

  • లిబియా సైన్యాధ్యక్షుడు: జనరల్ ముహమ్మద్ అలీ అహ్మద్ అల్-హద్దాద్.

  • అధికారులు: నలుగురు ఉన్నత స్థాయి సైనిక అధికారులు.

  • సిబ్బంది: ముగ్గురు విమాన సిబ్బంది ఉన్నారు.

కీలక నేతగా గుర్తింపు

లిబియా సైన్యాధ్యక్షుడు మృతిని ఆ దేశ ప్రధాన మంత్రి అబ్దుల్-హమీద్ ద్బీబా అధికారికంగా ధృవీకరిస్తూ తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. పశ్చిమ లిబియాలో అత్యున్నత సైనిక కమాండర్‌గా సేవలందిస్తున్న అల్-హదాద్, ఐక్యరాజ్యసమితి (UN) ఆధ్వర్యంలో లిబియా సైన్యాన్ని ఏకం చేయడానికి జరుగుతున్న చర్చల్లో అత్యంత కీలక పాత్ర పోషించారు. ఆయన మరణం లిబియా సైనిక రంగానికి తీరని లోటని ప్రధాని పేర్కొన్నారు.

ప్రమాదానికి కారణాలపై ఆరా

ప్రమాదానికి గల ఖచ్చితమైన కారణాలు ఇంకా తెలియరాలేదు. టేకాఫ్ అయిన కొద్దిసేపటికే సాంకేతిక లోపం తలెత్తిందా? లేక వాతావరణ పరిస్థితులు ప్రభావం చూపాయా? అనే కోణంలో టర్కీ అధికారులు దర్యాప్తు ప్రారంభించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *