KTR

KTR: సీఎం రేవంత్‌పై కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు

KTR: గత సార్వత్రిక ఎన్నికల్లో హైదరాబాద్‌లోని ఒక్క శాసనసభ స్థానాన్ని కూడా కాంగ్రెస్ పార్టీ గెలుచుకోలేకపోయిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గుర్తు చేశారు. గత పదేళ్లుగా తెలంగాణ రాష్ట్రంలో మతపరమైన, ప్రాంతీయపరమైన విభేదాలకు తావు లేకుండా తాము పాలన సాగించామని ఆయన స్పష్టం చేశారు.

“హైడ్రా” పేరుతో పేదల ఇళ్లను కూల్చివేసే ప్రయత్నాలు జరుగుతున్నాయని కేటీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు. హైదరాబాద్ నగరంలో చెరువుల ఆక్రమణల గురించి ప్రస్తావిస్తూ, రేవంత్ రెడ్డి, తిరుపతి రెడ్డి, పొంగులేటి, కేవీపీ వంటి నాయకులకు సైతం చెరువులో ఇళ్లు కట్టినా పట్టించుకోరంటూ పరోక్షంగా విమర్శించారు.

గత పదేళ్లలో బీఆర్ఎస్ ప్రభుత్వం అందరినీ కలుపుకుపోయి పాలించిందని, ప్రజల మధ్య ఎలాంటి గొడవలు లేకుండా చూసిందని కేటీఆర్ పేర్కొన్నారు. అయితే, ప్రస్తుత ప్రభుత్వం పేదల ఇళ్ల కూల్చివేతలకు పూనుకోవడంపై ఆయన తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ చర్యలు పేదలను నిరాశ్రయులను చేస్తాయని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

ALSO READ  Telangana: మ‌లుపులు తిరుగుతున్న ఫిరాయింపు ఎమ్మెల్యేల వ్య‌వ‌హారం

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *