Jeevandan:

Jeevandan: చనిపోతూ ఆరుగురి ప్రాణాల‌కు ఆయువు పోసిన యువ‌కుడు

Jeevandan:  పుట్టామా! బ‌తికామా! వెళ్లామా! ఈ స్వ‌ల్ప‌కాలంలో మ‌నిషులంద‌రి జీవితం ఇంతే. కానీ, కొంద‌రే తాము వెళ్లినా త‌మ గురించి చెప్పుకునేలా చేస్తారు? మ‌రికొంద‌రు ఇంకొక‌రి ప్రాణాల‌కు ఆస‌రా అవుతారు. వారి జీవితాల‌కు వెలుగునిస్తారు. అలాంటి మేలే చేశాడు ఈ వ‌రంగ‌ల్ యువ‌కుడు. తాను చ‌నిపోతూ ఆరుగురికి ప్రాణాల‌ను నిల‌బెట్టాడు. అంద‌రూ ఆయ‌న వెళ్లిన ఆయ‌న పేరు చెప్పుకొని ఆ ఆరు ఇండ్ల‌లో సంతోషంగా ఉన్నారు.

Jeevandan: వ‌రంగ‌ల్ జిల్లా వ‌ర్ధ‌న్న‌పేటకు చెందిన ర‌మ‌ణ (25) ట్రాక్ట‌ర్ ప్ర‌మాదంలో ఇటీవ‌ల తీవ్ర‌గాయాల‌పాల‌య్యాడు. ఆసుప‌త్రికి తీసుకెళ్తే బ్రెయిన్‌డెడ్ అయింద‌ని వైద్యులు నిర్ధారించారు. ఈ స‌మ‌యంలో ర‌మ‌ణ కుటుంబ స‌భ్యులు ఔధార్యం ప్ర‌ద‌ర్శించారు. మాన‌వ‌త్వాన్ని చూపారు. మ‌రో ప్రాణాల‌తో కొట్టుమిట్టాడుతున్న ఆరుగురికి అవ‌య‌వ‌దానానికి ముందుకొచ్చారు.

Jeevandan: ర‌మ‌ణ కుటుంబ సభ్యులు జీవన్‌దాన్ తెలంగాణ విన‌తికి ఒప్పుకున్నారు. ర‌మ‌ణ‌ క‌ళ్లు, కిడ్నీలు, గుండెను సేక‌రించి ఆరుగురి ప్రాణాల‌ను నిల‌బెట్టిన‌ట్టు జీవ‌న్‌దాన్ తెలంగాణ ప్ర‌క‌టించింది. ఆ కుటుంబాల్లో వెలుగును నింపిన ర‌మ‌ణ‌కు వారి కుటుంబ స‌భ్యులు జీవితాంతం రుణ‌ప‌డి ఉంటామ‌ని చెప్పుకున్నారు.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

ALSO READ  Rahul Gandhi: కాంగ్రెస్ నాయకులు బీజేపీకి బీ టీంలా పనిచేస్తున్నారు.. రాహుల్ సెన్సేషనల్ కామెంట్స్..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *