Iran Protests

Iran Protests: ఇరాన్ గగనతలం మూసివేత: భారత విమానయాన సంస్థల హెచ్చరికలు!

Iran Protests: ఇరాన్‌లో గత కొన్ని రోజులుగా కొనసాగుతున్న హింసాత్మక నిరసనలు, ఆ దేశానికి అమెరికాకు మధ్య పెరిగిన యుద్ధ వాతావరణం ఇప్పుడు అంతర్జాతీయంగా పెను సంచలనం సృష్టిస్తున్నాయి. ఈ క్లిష్ట పరిస్థితుల నేపథ్యంలో ఇరాన్ ప్రభుత్వం తన గగనతలాన్ని (Airspace) వాణిజ్య విమానాల కోసం తాత్కాలికంగా మూసివేస్తూ సంచలన నిర్ణయం తీసుకుంది. దీంతో భారత విమానయాన సంస్థలైన ఎయిర్ ఇండియా, ఇండిగో, స్పైస్‌జెట్ తమ ప్రయాణికులకు అత్యవసర హెచ్చరికలు జారీ చేశాయి. గగనతలం మూసివేత కారణంగా అంతర్జాతీయ విమాన ప్రయాణ సమయం పెరగడమే కాకుండా, కొన్ని సర్వీసులు పూర్తిగా రద్దు అయ్యే అవకాశం ఉందని సంస్థలు స్పష్టం చేశాయి.

ఇరాన్ మీదుగా వెళ్లే విమానాలను ప్రస్తుతం సురక్షితమైన ఇతర మార్గాల్లోకి మళ్లిస్తున్నారు. ఈ మార్పుల వల్ల ప్రయాణ సమయం పెరిగి, విమానాలు ఆలస్యంగా నడిచే అవకాశం ఉంది. దారి మళ్లించడం కుదరని పక్షంలో కొన్ని విమానాలను ఇప్పటికే రద్దు చేశారు. తమ ప్రయాణానికి ముందే విమాన స్థితిగతులను ఒకసారి తనిఖీ చేసుకోవాలని, విమానయాన సంస్థల వెబ్‌సైట్లు లేదా సోషల్ మీడియా ఖాతాలను గమనిస్తూ ఉండాలని కంపెనీలు సూచించాయి. ముఖ్యంగా విదేశాలకు వెళ్లే భారతీయులకు ఈ ఆంక్షలు పెద్ద సవాలుగా మారాయి.

Also Read: Komatireddy Venkat Reddy: పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టును కేసీఆర్ ఎందుకు పూర్తి చేయలేదు?

ఇరాన్ లోపల జరుగుతున్న నిరసనలు తీవ్ర రూపం దాల్చడంతో అక్కడ శాంతిభద్రతలు పూర్తిగా క్షీణించాయి. ఈ పరిణామాల దృష్ట్యా భారత విదేశీ వ్యవహారాల శాఖ (MEA) మరోసారి కీలక ప్రకటన చేసింది. ఇరాన్‌లో ఉన్న భారతీయ పౌరులు (విద్యార్థులు, యాత్రికులు, వ్యాపారులు) అందుబాటులో ఉన్న రవాణా సౌకర్యాల ద్వారా వీలైనంత త్వరగా ఆ దేశాన్ని విడిచి రావాలని సూచించింది. అలాగే, ఇతర భారతీయులెవరూ ప్రస్తుత పరిస్థితుల్లో ఇరాన్‌కు వెళ్లొద్దని గట్టిగా హెచ్చరించింది. ఇరాన్ అధికారులు అమెరికా సైనిక స్థావరాలను లక్ష్యంగా చేసుకుంటామని హెచ్చరించడం వల్ల ఉద్రిక్తతలు మరింత ముదిరాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *