Revanth Reddy

Revanth Reddy: ఉజ్జయిని మహంకాళి బోనాలకు సీఎం రేవంత్ రెడ్డిని ఆహ్వానించిన అర్చకులు

Revanth Reddy: జులై 13న సికింద్రాబాద్ లోని ఉజ్జయిని మహంకాళి అమ్మవారి దేవస్థానంలో నిర్వహించనున్న బోనాల మహోత్సవాల్లో పాల్గొనాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఆలయ అధికారులు ఆహ్వానించారు. సోమవారం సెక్రటేరియట్ లో మంత్రి కొండా సురేఖ, పొన్నం ప్రభాకర్, దేవాదాయ శాఖ అధికారులు ముఖ్యమంత్రిని కలిసి ఆహ్వాన పత్రిక అందజేశారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డికి ఉజ్జయిని మహంకాళి ఆలయ అర్చకులు వేద మంత్రాలతో ఆశీర్వచనం అందించారు. మరో వైపు ఈ బోనాల ఉత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేస్తోంది.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *