Chhattisgarh Encounter: బీజాపూర్ ఐఈడీ పేలుడు: ఛత్తీస్గఢ్లోని బీజాపూర్లో నక్సలైట్లు భద్రతా బలగాల వాహనంపై ఐఈడీతో దాడి చేశారు. కుట్రు మార్గ్లో అమర్చిన ఐఈడీలో 10 మంది జవాన్లు మరణించారు. 6 మందికి పైగా జవాన్లు తీవ్రంగా గాయపడ్డారు ఛత్తీస్గఢ్లోని బీజాపూర్లో నక్సలైట్లు భారీ దాడికి పాల్పడ్డారు. భద్రతా బలగాల వాహనాన్ని ఐఈడీ లక్ష్యంగా చేసుకుంది. కుట్రు మార్గ్లో నక్సలైట్లు ఐఈడీని అమర్చగా, భద్రతా బలగాల వాహనం దానిని ఢీకొట్టింది. ఐఈడీ పేలుడు కారణంగా 9 మంది జవాన్లు వీరమరణం పొందారు. 6 మందికి పైగా జవాన్లు తీవ్రంగా గాయపడ్డారు. సైనికుల బృందం ఒక ఆపరేషన్ నుండి తిరిగి వస్తోంది.
Chhattisgarh Encounter: దంతేవాడ, నారాయణపూర్ ఇంకా బీజాపూర్ జాయింట్ ఆపరేషన్ ముగించుకుని తిరిగి వస్తుండగా బీజాపూర్ జిల్లాలోని కుట్రు-బెద్రే రహదారిపై నక్సలైట్లు దాడి చేశారు. కుత్రు పోలీస్ స్టేషన్ పరిధిలోని అంబేలి గ్రామం సమీపంలో మధ్యాహ్నం 2:15 గంటలకు నక్సలైట్లు భద్రతా బలగాల వాహనాన్ని పేల్చివేశారు
Chhattisgarh Encounter: ఐజీ బస్తర్ తెలిపిన వివరాల ప్రకారం.. బీజాపూర్లో నక్సలైట్లు భద్రతా బలగాల వాహనాన్ని ఐఈడీ తోపేల్చివేశారు. ఈ దాడిలో దంతెవాడకు చెందిన ఎనిమిది మంది డీఆర్జీ జవాన్లు, ఓ డ్రైవర్ వీరమరణం పొందారు. దంతేవాడ, నారాయణ్పూర్ ఇంకా బీజాపూర్లలో జాయింట్ ఆపరేషన్ ముగించుకుని భద్రతా బలగాలు తిరిగి వస్తున్న సమయంలో నక్సలైట్లు పథకం ప్రకారం 2:15 నిమిషాలకు దాడి చేసారు
Chhattisgarh Encounter: ఛత్తీస్గఢ్ శాసనసభ స్పీకర్ రమణ్సింగ్ బీజాపూర్ ఐఈడీ పేలుడు ఘటనపై మాట్లాడుతూ నక్సలైట్లపై పెద్దఎత్తున ఆపరేషన్లు జరిగినప్పుడల్లా ఇలాగే ప్రవర్తిస్తున్నారని అన్నారు. నక్సలిజానికి వ్యతిరేకంగా చత్తీస్గఢ్ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను ఇంకా ఉధృతం చేస్తుంది.వారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు
Chhattisgarh Encounter: ఐఈడీ పేలుడు ఘటనను నక్సలిజం చర్యగా ఛత్తీస్గఢ్ ఉప ముఖ్యమంత్రి అరుణ్ సా అభివర్ణించారు. నక్సలైట్ల దాడికి సంబంధించిన సమాచారం బీజాపూర్ నుంచి వచ్చిందని అరుణ్ సా తెలిపారు. ఇది నక్సలైట్ల పిరికిపంద చర్య. సైనికుల బలిదానం మరువలేనిది. త్వరలో ఛత్తీస్గఢ్ నక్సల్స్ విముక్తమవుతుంది అని వ్యాక్యనించారు.
Beta feature