Rishabh Pant

Rishabh Pant: రిషబ్ పంత్‌కు ఐసీసీ షాక్..

Rishabh Pant: లీడ్స్ టెస్ట్ మ్యాచ్ లో రెండు సెంచరీలు సాధించి చరిత్ర సృష్టించిన టీమిండియా వికెట్ కీపర్ రిషబ్ పంత్ కు ఐసీసీ గట్టి షాకిచ్చింది. ఐసిసి ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించినందుకు రిషబ్ పంత్‌కు వార్నింగ్ ఇచ్చింది. లెవల్ 1 కింద పంత్ దోషిగా తేల్చింది. దీంతో మ్యాచ్ రిఫరీ పంత్‌ను హెచ్చరించారు. అంతర్జాతీయ మ్యాచ్‌లలో అంపైర్ నిర్ణయాన్ని నిరసించడం లేదా అభ్యంతరం చెప్పడం వంటివి చేసిన పంత్ ను ఆర్టికల్ 2.8 కింద దోషిగా నిర్ధారించినట్లు ఐసిసి ఒక ప్రకటన విడుదల చేసింది. ఈ ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించినందుకు పంత్ ఖాతాకు 1 డీమెరిట్ పాయింట్ ఇచ్చినట్లు తెలిపింది.

పంత్ చేసిన తప్పు ఏమిటి?
నిజానికి లీడ్స్ టెస్ట్ మూడో రోజు, ఇంగ్లాండ్ తొలి ఇన్నింగ్స్ 61వ ఓవర్‌లో, బంతి ఆకారం మారిపోయింది. దానిని మార్చమని పంత్ అంపైర్‌ను అభ్యర్థించాడు. కానీ గేజ్ తో బంతిని తనిఖీ చేసిన అంపైర్..దానిని మార్చడానికి నిరాకరించాడు. దీనితో కలత చెందిన పంత్, అంపైర్ ముందు బంతిని నేలపై విసిరి తన నిరసనను వ్యక్తం చేశాడు. దీనికి సంబంధించి ఐసీసీ చర్యలు తీసుకుంది.

ఇది కూడా చదవండి: Rishabh Pant: దుమ్మురేపిన పంత్..సెహ్వాగ్ రికార్డు బ్రేక్..!

తప్పును అంగీకరించిన పంత్
రిషబ్ పంత్ ఆ కేసులో తన నేరాన్ని మ్యాచ్ రిఫరీ రిచీ రిచర్డ్‌సన్ ముందు అంగీకరించాడు. కాబట్టి, ఆ కేసులో తదుపరి దర్యాప్తు అవసరం లేదు. పంత్ నిరసనపై ఆన్-ఫీల్డ్ అంపైర్లు పాల్ రీఫెల్, క్రిస్ జాఫ్నీ మ్యాచ్ రిఫరీకి ఫిర్యాదు చేశారు. అతనితో పాటు థర్డ్ అంపైర్ షర్ఫుదుల్లా, ఫోర్త్ అంపైర్ మైక్ బర్న్స్ కూడా ఆరోపణలు చేశారని ఐసీసీ తెలిపింది. నిజానికి, ICC నిబంధనలలోని లెవల్ 1 ప్రకారం దోషులుగా తేలిన ఆటగాళ్లకు కనీస శిక్ష మందలింపు. గరిష్ట శిక్ష ఏమిటంటే వారి మ్యాచ్ ఫీజులో 50 శాతం తగ్గింపు, ఒకటి లేదా రెండు డీమెరిట్ పాయింట్లు. పంత్ ఇప్పుడు లెవల్ 1 కింద దోషిగా తేలి, మందలింపుకు గురయ్యాడు.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *