Hyderabad: ఏపీ నుంచి వస్తున్న కోళ్లు వెనక్కి.. అప్రమత్తమైన తెలంగాణ సర్కార్..

Hyderabad: తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రంలో బర్డ్ ఫ్లూ వ్యాప్తిని నియంత్రించేందుకు కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటోంది. ఈ నేపథ్యంలో, రాష్ట్ర సరిహద్దుల్లో 24 చెక్‌పోస్టులను ఏర్పాటు చేసింది. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణకు కోళ్లు, కోడి మాంసం తరలింపును నియంత్రించేందుకు నిఘా మరింత కఠినతరం చేసింది.

ఉమ్మడి నల్గొండ జిల్లాలో మూడు చెక్‌పోస్టులను ఏర్పాటు చేసి, ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చే కోళ్ల వాహనాలను వెనక్కి పంపిస్తున్నారు. రాష్ట్రంలో బర్డ్ ఫ్లూ వ్యాప్తిని అడ్డుకోవడానికి అధికారులు తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నారు.

ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అనుమానాస్పద పరిస్థితుల్లో అధికారులను సంప్రదించాలని ఆరోగ్య, పశుసంవర్ధక శాఖలు సూచిస్తున్నాయి. ప్రభుత్వం నుంచి వచ్చే అధికారిక మార్గదర్శకాలను పాటించడం వల్ల ఈ వ్యాధి నియంత్రణలో సహాయపడుతుంది.

 

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *