Hyderabad : ప్రైవేట్ ఉన్నత విద్యాసంస్థల సమాఖ్య కీలక నిర్ణయం తీసుకుంది. రేపటి నుంచి పరీక్షలను బహిష్కరించనున్నట్లు ప్రకటించింది. ఈ నెల 8న హైదరాబాద్లో కాలేజీల సిబ్బందితో సమావేశం నిర్వహించనున్నారు. అలాగే 11న 10 లక్షల మంది విద్యార్థులతో భారీ సమావేశం ఏర్పాటు చేయనున్నారు. తమ డిమాండ్స్ నెరవేర్చే వరకు బంద్ కొనసాగుతుందని సమాఖ్య స్పష్టం చేసింది.

