Champions Trophy 2025

Champions Trophy 2025: అట్టహాసంగా మొదలైన ఛాంపియన్స్ సమరం..! మరి దాని చరిత్ర గురించి తెలుసుకుందామా..??

Champions Trophy 2025: ఛాంపియన్స్ ట్రోఫీ 2025 సన్నాహకాలు ముగిసాయి. దాదాపు ఎనిమిదేళ్ల తర్వాత జరగనున్న ఈ చిన్న ప్రపంచ కప్‌కు అభిమానులు చాలా ఉత్సాహంగా ఎదురుచూస్తున్నారు. ఈ పెద్ద టోర్నీలో విజయం సాధించి ట్రోఫీని గెలుచుకోవాలన్న పట్టుదలతో భారత జట్టు ఉంది. ఈ సందర్భంగా, ఛాంపియన్స్ ట్రోఫీ ఎలా మొదలైంది, ఎప్పుడు ప్రారంభమైంది, అసలు దానిని ప్రారంభించడానికి వెనుక ఉన్న ఉద్దేశ్యం ఏమిటి అనే విషయాలను మనం తెలుసుకుందాం.

ఐసీసీ ఈ ఛాంపియన్స్ ట్రోఫీని మొదటిసారిగా 1998లో ప్రవేశపెట్టింది. ఆ సమయంలో, ఈ టోర్నీ యొక్క మొదటి పేరు ఐసీసీ నాకౌట్ ట్రోఫీ. టెస్టు క్రికెట్ ఆడని దేశాలలో క్రికెట్‌ను ప్రోత్సహించడమే ఈ టోర్నీ ప్రధాన లక్ష్యంగా ఉంది, అందుకోసం నిధులు సమీకరించడానికి ఈ టోర్నీ ఉపయోగపడింది. చివరిగా 2017లో ఈ టోర్నీ జరిగింది. 2002లో ఈ టోర్నీని ఛాంపియన్స్ ట్రోఫీగా పేరు మార్చారు.

ఇది కూడా చదవండి: ICC Champions Trophy 2025: పాకిస్తాన్ తో మళ్లీ వివాదం..! భారత జెండా పెట్టాల్సిందే అంటున్న బీసీసీఐ వైస్ ప్రెసిడెంట్

ఈ టోర్నీని మొదటి నుంచి వన్డే ఫార్మాట్లో జరుపుతున్నారు. మొదటి సారి ఈ ట్రోఫీకి బంగ్లాదేశ్ ఆతిథ్యమిచ్చింది. 2000 నుంచి 2004 వరకు అసోసియేట్ దేశాలు కూడా ఈ టోర్నీలో పాల్గొన్నాయి. అయితే, 2009 నుంచి మాత్రమే టాప్-8 జట్లు మాత్రమే పాల్గొన్నాయి. 2017 తర్వాత, ప్రతి ఫార్మాట్‌లో ఒకే ఒక పెద్ద టోర్నీ ఉండాలన్న నిర్ణయంతో ఈ టోర్నీని నిలిపివేశారు.

కానీ, 2021 నవంబర్‌లో ఐసీసీ మళ్లీ ఈ టోర్నీని నిర్వహించాలని ప్రకటించింది, పాకిస్థాన్‌కు ఆతిథ్యత హక్కులు ఇచ్చింది. 2029 సీజన్ భారత్‌లో జరగనుంది. 1998లో జరిగిన మొదటి ఎడిషన్‌లో సౌతాఫ్రికా విజేతగా నిలిచింది. 2000లో న్యూజిలాండ్, 2002లో శ్రీలంక మరియు భారత దేశాలు కలిసి విజయం సాధించాయి. 2004లో వెస్టిండీస్, 2006 మరియు 2009లో ఆస్ట్రేలియా రెండు సార్లు, 2013లో భారతదేశం, 2017లో పాకిస్థాన్ గెలుపు సాధించాయి.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *