Revanth Reddy: కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ నేతృత్వంలోని యూడీఎఫ్ (UDF) ఘనవిజయం సాధించడంపై తెలంగాణ ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. ఈ విజయం కేవలం ఒక ఎన్నికల ఫలితం మాత్రమే కాదని, కేరళ ప్రజల ఆకాంక్షలకు దక్కిన గౌరవమని ఆయన కొనియాడారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ శ్రేణులకు, యూడీఎఫ్ కార్యకర్తలకు రేవంత్ రెడ్డి ట్విట్టర్ (X) వేదికగా ప్రత్యేక శుభాకాంక్షలు తెలియజేశారు. కష్టపడి పని చేసి, చారిత్రాత్మక విజయాన్ని సొంతం చేసుకున్న ప్రతి ఒక్కరినీ ఆయన అభినందించారు.
ఈ అద్భుత విజయానికి కాంగ్రెస్ అగ్రనేతలు మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీల నాయకత్వమే ప్రధాన కారణమని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. వారి మార్గనిర్దేశంలో పార్టీ కార్యకర్తలు ఐక్యంగా పోరాడి ఈ ఫలితాన్ని రాబట్టారని ఆయన ప్రశంసించారు. ముఖ్యంగా రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీల ప్రచారం కేరళ ప్రజల్లో నూతన ఉత్తేజాన్ని నింపిందని, దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పునరుజ్జీవనానికి ఈ విజయం ఒక బలమైన సంకేతమని రేవంత్ అభిప్రాయపడ్డారు.
అంతేకాకుండా, కేరళ ఎన్నికల ప్రచారంలో భాగంగా తాను వెళ్ళినప్పుడు అక్కడి ప్రజలు చూపించిన ఆదరాభిమానాలను సీఎం రేవంత్ రెడ్డి ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. తన పర్యటనలో తనపై ఎనలేని ప్రేమను కురిపించిన కేరళ ప్రజలకు ఆయన ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. కేరళలో రాబోయే కొత్త ప్రభుత్వం ప్రజల ఆశయాలకు అనుగుణంగా పనిచేస్తుందని, కాంగ్రెస్ మార్క్ పాలనతో కేరళ మరింత అభివృద్ధి చెందుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.
My heartiest congratulations to all leaders, activists and our cadre of the Congress-led UDF alliance in #Kerala on an extraordinary, hard fought and inspiring victory.
I join all Congress party leaders and cadre to congratulate our leadership, especially Shri @RahulGandhi ji,… pic.twitter.com/mDuHiHNrFh
— Revanth Reddy (@revanth_anumula) May 4, 2026
