Chandrababu Schedule: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు (Chandrababu) సోమవారం (జూన్ 9) ఎంతో బిజీ షెడ్యూల్తో కొనసాగుతున్నారు. అభివృద్ధి లక్ష్యంగా తీసుకుని ఆయన వరుసగా సమీక్షలు నిర్వహించనున్నారు.
మొదటిగా, ఉదయం 11:30 గంటలకు రాష్ట్రంలోని హైవేలు, ప్రధాన రహదారుల నిర్మాణ పనులపై సమీక్ష చేపట్టనున్నారు. రాష్ట్ర మౌలిక సదుపాయాల అభివృద్ధిలో కీలకమైన ఈ అంశంపై అధికారులు, సంబంధిత విభాగాల అధికారులతో చర్చలు జరిపే అవకాశం ఉంది.
అనంతరం, మధ్యాహ్నం 2:30 గంటలకు రాష్ట్రవ్యాప్తంగా ఏర్పాటు చేసిన ‘స్వర్ణాంధ్ర కార్యాలయాలను’ వర్చువల్ విధానంలో ప్రారంభించనున్నారు. పరిపాలనను వేగవంతం చేయడం, ప్రజలకు సేవలు మరింత సమర్థవంతంగా అందించేందుకు ఈ కార్యాలయాలు ఉపయోగపడతాయని ప్రభుత్వ వర్గాలు భావిస్తున్నాయి.
ఇది కూడా చదవండి: Harish Rao: నేడు కాళేశ్వరం కమిషన్ ముందుకు హరీశ్రావు
ఈ కార్యక్రమం తరువాత, ముఖ్యమంత్రి మళ్లీ మినరల్స్పై దృష్టిసారించనున్నారు. మాయినింగ్ శాఖపై సమీక్షను నిర్వహించబోతున్నారు. రాష్ట్ర ఆదాయ వనరుల్లో ముఖ్యమైన ఈ విభాగంలో పారదర్శకత, భద్రత, ఆదాయ వృద్ధిపై దృష్టి సారించేలా చర్చలు జరగనున్నాయి.
కాగా, సాయంత్రం 4 గంటలకు “స్టేట్ క్వాంటమ్ మిషన్”పై సమీక్ష సమావేశం నిర్వహించనున్నారు. సాంకేతిక రంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకురాగల ఈ మిషన్ అమలుపై ముఖ్యమంత్రి ప్రత్యేక దృష్టి సారించనున్నారు.
చంద్రబాబు అభివృద్ధి శైలికి తగ్గట్టుగానే, ఈ రోజు షెడ్యూల్ కూడా అభివృద్ధిపై దృష్టి సారించిన అంశాలతో నిండిపోయినట్లు తెలుస్తోంది.