Central AID

Central AID: రాష్ట్రాలకు కేంద్రం విపత్తుల నిధి కేటాయింపు

Central AID: కేంద్ర ప్రభుత్వం 15 రాష్ట్రాలకు విపత్తుల నిధి కింద మొత్తం రూ.1115 కోట్లు కేటాయించింది. ఇందులో తమిళనాడుకు రూ.50 కోట్లు కేటాయించారు. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, వ్యవసాయ మంత్రి శివరాజ్ సింగ్, నీతి ఆయోగ్ వైస్ చైర్మన్‌లతో కూడిన కమిటీ న్యూఢిల్లీలో సమావేశమై దీనికి ఆమోదం తెలిపింది. దీని ప్రకారం డిజాస్టర్ మిటిగేషన్ ఫండ్ నుంచి రూ.1000 కోట్ల ఆర్థిక సహాయం అందజేస్తారు.

ఇది కాకుండా, జాతీయ విపత్తు సహాయ నిధి కింద అన్ని రాష్ట్రాలు,  కేంద్ర పాలిత ప్రాంతాలకు పంపిణీ చేయడానికి రూ.115.67 కోట్లు ప్రతిపాదించి ఆమోదించారు. 15 రాష్ట్రాల్లో కొండచరియలు విరిగిపడే ప్రమాదాన్ని తగ్గించే ప్రతిపాదన కోసం జాతీయ విపత్తు నివారణ నిధి నుండి రూ.1,000 కోట్లను కూడా ఆమోదించింది.

Central AID: విపత్తుల నిధిగా మహారాష్ట్రకు మహారాష్ట్ర – రూ.100 కోట్లు, కర్ణాటక, కేరళ ఒక్కోరాష్ట్రానికి  రూ.72 కోట్లు, తమిళనాడుకు  రూ.50 కోట్లు, ఉత్తరాఖండ్ కు రూ.139 కోట్లు, హిమాచల్ ప్రదేశ్ కు రూ.139 కోట్లు, పశ్చిమ బెంగాల్ కు రూ.50 కోట్లు, 8 ఈశాన్య రాష్ట్రాలకు రూ.378 కోట్లు కేటాయించారు.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *