Sri Reddy: నటి శ్రీరెడ్డి పై రాజమహేంద్రవరంలో కేసు నమోదైంది. సోషల్ మీడియాలో సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్కల్యాణ్, మంత్రి లోకేశ్ హోంమంత్రి అనితపై.. అసభ్య వ్యాఖ్యలతో సోషల్ మీడియా లో ఆమె వీడియో చేశారు. ఈ నేపథ్యంలో శ్రీరెడ్డి పైన చెర్యలు తీసుకోవాలని టీడీపీ మహిళా నేత మజ్జి పద్మ ఫిర్యాదుతో బొమ్మూరు పీఎస్లో 196,353(2),79 BNS,67 ITA-2000-2008 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.

