Crime News: తల్లిలా లాలించి బుజ్జగించాల్సిన టీచరే పసిపాపపై కర్కశత్వాన్ని ప్రదర్శించిన అమానుష ఘటన ఆదిలాబాద్ జిల్లాలో వెలుగుచూసింది. నర్సరీ చదువుతున్న నాలుగేళ్ల చిన్నారి సరిగ్గా అక్షరాలు రాయలేదన్న కోపంతో ఓ ప్రైవేట్ పాఠశాల ఉపాధ్యాయురాలు ఏకంగా ఎనిమిది నిమిషాల పాటు విచక్షణారహితంగా చితకబాదింది. ఒంటిపై గాయాలు చూసి తల్లిదండ్రులు నిలదీయగా.. సీసీటీవీ కెమెరాల్లో ఈ దారుణం బట్టబయలైంది. ఈ ఘటన స్థానికంగా తీవ్ర ఆగ్రహానికి దారితీయగా, పోలీసులు సదరు టీచర్తో పాటు పాఠశాల యాజమాన్యంపై కేసు నమోదు చేశారు.
అసలేం జరిగింది?..
సీసీటీవీతో బయటపడ్డ నిజం..
అధికారులు, పోలీసుల చర్యలు..
బాలుడి తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు ఉపాధ్యాయురాలు సింధూజతో పాటు వేదం పాఠశాల యాజమాన్యంపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించినట్లు ఎస్సై పురుషోత్తం తెలిపారు. ఈ ఘటనపై సమగ్ర విచారణ జరిపి పూర్తి వివరాలతో కూడిన నివేదికను జిల్లా విద్యాశాఖాధికారికి (DEO) సమర్పిస్తామని మండల విద్యాశాఖాధికారి (MEO) మహమ్మద్ హుస్సేన్ వెల్లడించారు.
చిన్నారులపై ఇలాంటి శారీరక హింసకు పాల్పడే ఉపాధ్యాయులపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకోవాలని, పాఠశాల గుర్తింపును రద్దు చేయాలని స్థానికులు, విద్యార్థి సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.
