AP news: సింగయ్య మృతి కేసులో జగన్‌కు నోటీసులు

Ap News: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్‌మోహన్ రెడ్డి ఇటీవల పల్నాడు జిల్లాలోని రెంటపాళ్లలో చేసిన పర్యటనలో జరిగిన ఘ‌ట‌న రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర కలకలం రేపుతోంది. పర్యటన సందర్భంగా సింగయ్య అనే వ్యక్తి జగన్ ప్రయాణిస్తున్న వాహనం కింద పడి మృతి చెందినట్లు వీడియోలు వైరల్ అవుతున్నాయి. ఈ దృశ్యాల ఆధారంగా పోలీసులు కేసులో మలుపు తిప్పారు.

మొదట అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసిన పోలీసులు, ప్రస్తుతం సంబంధిత సెక్షన్లను మార్చి జగన్‌ను ఈ కేసులో రెండో నిందితుడిగా (ఏ2) చేర్చారు. ఈ క్రమంలో తాజాగా పోలీసులు జగన్‌కు నోటీసులు జారీ చేశారు.

నోటీసులను తాడేపల్లిలోని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయానికి తీసుకెళ్లి, అక్కడ పార్టీ కార్యదర్శి లేళ్ల అప్పిరెడ్డికి అందజేశారు. అంతేకాక, సింగయ్య మృతికి కారణమైనదిగా అనుమానిస్తున్న ఫార్చ్యూనర్ వాహనం (AP 40 DH 2349) ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

ఈ ఘటనపై అధికార వర్గాలు ఇంకా స్పందించనప్పటికీ, రాజకీయంగా ఇది సంచలనంగా మారింది. కేసు పరిణామాల పట్ల ప్రజలు, రాజకీయ పర్యవేక్షకులు ఆసక్తిగా చూస్తున్నారు.

 

 

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *