Talliki Vandanam Scheme: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విద్యార్థుల చదువుల కోసం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన ‘తల్లికి వందనం’ పథకానికి సంబంధించి కీలకమైన అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్రంలో పిల్లల చదువుల కోసం తల్లులు పడే ఆర్థిక ఇబ్బందులను తగ్గించడమే ఈ పథకం యొక్క ముఖ్య ఉద్దేశం. ఈ నెల 24న (జూలై 24, 2026) అర్హులైన తల్లుల బ్యాంకు ఖాతాల్లో నేరుగా నగదు జమ కానుంది.
రూ.10,000 కోట్లకు పైగా నిధులు.. 42 లక్షల మంది తల్లులకు లబ్ధి!
ఈ పథకం అమలు కోసం ఏపీ ప్రభుత్వం మొత్తం రూ.10,120.78 కోట్ల పరిపాలనా అనుమతులు మంజూరు చేయగా, ప్రస్తుతానికి రూ.10,049 కోట్ల నిధులను విడుదల చేసింది.రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 42,70,802 మంది తల్లులు లేదా సంరక్షకులు (Guardians) ఈ పథకం ద్వారా లాభం పొందనున్నారు. దీనివల్ల 67,47,190 మంది విద్యార్థులకు ప్రయోజనం చేకూరనుంది.ఒకటో తరగతి (1st Class) నుండి ఇంటర్మీడియట్ (12వ తరగతి) వరకు చదువుతున్న విద్యార్థులందరికీ ఈ పథకం వర్తిస్తుంది. ప్రభుత్వ బడులతో పాటు ‘ఆర్టీఈ’ (RTE) చట్టం కింద ప్రైవేట్ స్కూళ్లలో ఉచిత సీట్లు పొంది చదువుతున్న పిల్లలకు కూడా ఈ పథకాన్ని వర్తింపజేస్తున్నారు.
రూ.15 వేల సాయం.. స్కూళ్ల అభివృద్ధికి రూ.2 వేలు మినహాయింపు!
పథకానికి అర్హులైన ప్రతి విద్యార్థికి ఏడాదికి రూ.15,000 ఆర్థిక సాయం అందుతుంది.అయితే, ఈ రూ.15 వేల నుండి ఒక్కో విద్యార్థికి రూ.2,000 చొప్పున పాఠశాలల అభివృద్ధి నిధి (School Development Fund) కోసం ప్రభుత్వం మినహాయిస్తుంది (కట్ చేస్తుంది).ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ విద్యార్థులకు కేంద్ర ప్రభుత్వం నుండి వచ్చే స్కాలర్షిప్ మొత్తాన్ని మినహాయించి, మిగిలిన బ్యాలెన్స్ మొత్తాన్ని ఈ ‘తల్లికి వందనం’ పథకం కింద రాష్ట్ర ప్రభుత్వం చెల్లిస్తుంది.
‘తల్లికి వందనం’ ముఖ్యాంశాల షెడ్యూల్ (2026):
ప్రభుత్వం దరఖాస్తులు, అర్హుల లిస్ట్ల కోసం ఒక పక్కా టైమ్లైన్ను ప్రకటించింది:
-
జూలై 22 – అర్హుల లిస్ట్: మొదటగా 64,76,590 మంది విద్యార్థులకు సంబంధించిన అర్హులు, అనర్హుల ప్రాథమిక జాబితాలను స్కూళ్లలో ప్రచురిస్తారు.
-
జూలై 22 నుండి ఆగస్టు 3 – అభ్యంతరాల స్వీకరణ: లిస్ట్లో పేర్లు తప్పుగా పడినా లేదా పేరు రాకపోయినా ఫిర్యాదులు, అభ్యంతరాలు సమర్పించడానికి ఈ గడువు ఇచ్చారు.
-
ఆగస్టు 4 నుండి 10 – పరిశీలన: వచ్చిన ఫిర్యాదులను అధికారులు చెక్ చేసి, అదనంగా అర్హులైన వారి లిస్ట్ను రెడీ చేస్తారు.
-
ఆగస్టు 25 వరకు – కొత్త అడ్మిషన్లకు ఛాన్స్: ఈ ఏడాది కొత్తగా 1వ తరగతిలో చేరిన వారికి, అలాగే ఇంటర్ ఫస్టియర్ చేరిన కొత్త విద్యార్థులకు వివరాలు నమోదు చేసుకోవడానికి ఆగస్టు 25 వరకు టైమ్ ఇచ్చారు.
-
ఆగస్టు 30 – రెండో విడత నగదు: కొత్తగా యాడ్ అయిన అదనపు అర్హుల లిస్ట్ను ఆగస్టు 30న విడుదల చేసి, అదే రోజు వారి తల్లుల అకౌంట్లలో కూడా డబ్బులు జమ చేస్తారు.
