Lottery King

Lottery King: కోయంబత్తూర్ లాటరీ కింగ్.. సంవత్సర ఆదాయం తెల్సి విస్తుపోయిన ఈడీ అధికారులు!

Lottery King: లాటరీ రారాజుగా పేరుగాంచిన కోయంబత్తూరుకు చెందిన మార్టిన్ తన లాటరీ వ్యాపారం ద్వారా ఏడాదికి రూ.15,000 కోట్లు సంపాదిస్తున్నట్లు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ దర్యాప్తులో తేలింది.

శాంటియాగో మార్టిన్ కోయంబత్తూరుకు చెందినవాడు. లాటరీ వ్యాపారంలో ఏడాదికి 15,000 కోట్ల రూపాయలు సంపాదిస్తున్నట్లు ఎన్‌ఫోర్స్‌మెంట్ విభాగం విచారణలో వెల్లడైంది. అతనికి చెందిన వెయ్యి కోట్ల రూపాయల విలువైన ఆస్తులను ఎన్‌ఫోర్స్‌మెంట్ విభాగం జప్తు చేసింది.

మార్టిన్ లాటరీ వ్యాపారంలో అక్రమంగా సంపాదించిన రూ.622 కోట్ల ఆస్తులను కొచ్చి జోనల్ ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్, రూ.409 కోట్ల ఆస్తులను కోల్‌కతా జోనల్ ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ జప్తు చేశాయి.

ఇది కూడా చదవండి: Allu Arjun: అల్లు అర్జున్ బెయిల్ పిటిష‌న్‌పై నేడే తీర్పు

Lottery King: 2014లో సీబీఐ నమోదు చేసిన కేసు, 2022లో కోల్‌కతా పోలీసులు నమోదు చేసిన రెండు కేసులు, 2024లో మేఘాలయ ప్రభుత్వం నమోదు చేసిన కేసు ఆధారంగా ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ దర్యాప్తు చేపట్టగా.. 1500 కోట్ల రూపాయల నష్టం వాటిల్లినట్లు ఆరోపణలు వచ్చాయి.

ఎన్‌ఫోర్స్‌మెంట్ ఏజెన్సీలు ఇటీవల మార్టిన్‌తో పాటు అతనికి చెందిన కంపెనీలపై దాడులు నిర్వహించాయి. లెక్కల్లో చూపని రూ.12 కోట్ల నగదు, రూ.6.4 కోట్ల విలువైన డిపాజిట్లను స్వాధీనం చేసుకున్నారు. కోయంబత్తూర్, చెన్నై, ముంబై, దుబాయ్ మరియు లండన్‌లలో ఆస్తులు,  స్టాక్ మార్కెట్ పెట్టుబడులు ఈడీ దాడుల్లో కనుగొన్నారు. .

మార్టిన్ యాజమాన్యంలోని ఫ్యూచర్ గేమింగ్ అండ్ హోటల్ సర్వీసెస్ లిమిటెడ్, ఎలక్టోరల్ బాండ్ల ద్వారా రాజకీయ పార్టీలకు ఉదారంగా నిధులు సమకూర్చడంలో ప్రసిద్ధి చెందింది. 2019 నుంచి 2024 మధ్య కాలంలో రాజకీయ పార్టీలకు కంపెనీ రూ.1368 కోట్లు విరాళంగా అందించింది.

 

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

ALSO READ  samantha: షూట్‌లో బాగా ఏడ్చేశా.. సమంత ఆసక్తికర కామెంట్స్‌

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *