Viral News

Viral News: ఇండియాలో ఇంతే.. రైలు క్లీన్ చేసి.. ట్రాక్ మీదే వేసేశాడు

Viral News: దేశవ్యాప్తంగా పర్యావరణ పరిరక్షణ, పరిశుభ్రతపై విస్తృత చర్చ జరుగుతున్న తరుణంలో, ఒక రైల్వే ఉద్యోగి కదులుతున్న రైలు నుండి పట్టాలపై చెత్త విసిరేసిన వీడియో ఇంటర్నెట్‌లో వైరల్‌గా మారింది. ఈ సంఘటన రైల్వేల స్వచ్ఛతా నిబంధనలను ఉల్లంఘించడమే కాకుండా, సాధారణ పౌరులకు కూడా చెడు సందేశాన్ని పంపడంపై ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

వైరల్ వీడియోలో ఏం జరిగింది?

ఇంటర్నెట్‌లో వైరల్ అవుతున్న వీడియోలో ఒక రైల్వే ఉద్యోగి చెత్త బుట్టలోని పాలిథిన్ బ్యాగ్‌ను తీసుకొని కదులుతున్న రైలు నుండి బయటకు విసిరేయడానికి ప్రయత్నిస్తుండటం కనిపిస్తుంది. రైలులో ప్రయాణిస్తున్న ఒక ప్రయాణీకుడు అతడిని అలా చేయకుండా వారించినా, ఆ ఉద్యోగి పట్టించుకోకుండా చెత్తను బయటకు విసిరేశాడు.

చెత్తను వేసిన ఉద్యోగి వెటకారపు సమాధానం

ఈ వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసిన యూజర్ @abhiscosmoss, తన వాదనను క్యాప్షన్‌లో వివరంగా తెలియజేశారు.

తాను నవంబర్ 4, 2025న  సీల్దా అలీఘర్ సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ (12987)లో ప్రయాణిస్తున్నప్పుడు ఈ సంఘటన తన కళ్లెదుటే జరిగిందని తెలిపారు. “నువ్వు రైలును శుభ్రం చేసి ఎందుకు చుట్టుపక్కల ప్రాంతాలను మురికి చేశావు?” అని తాను ప్రశ్నించగా, ఆ ఉద్యోగి వెటకారంగా సమాధానం చెప్పినట్లు తెలిపారు. “నేను ఈ చెత్తను ఇంటికి తీసుకెళ్లాలా?” అంటూ ఆ ఉద్యోగి ఎదురు ప్రశ్నించాడని @abhiscosmoss పేర్కొన్నారు. తాను ఇది తప్పు అని, ఇలా చేయకూడదని అతనికి వివరించడానికి ప్రయత్నించినా, ఆ ఉద్యోగి వినడానికి సిద్ధంగా లేడని ఆవేదన వ్యక్తం చేశారు.

ఇది కూడా చదవండి: Siva Re Release: చిరంజీవికి క్షమాపణలు చెప్పిన ఆర్జీవీ

సామాజిక స్పందన – తీవ్ర ఆగ్రహం

సాధారణ ప్రజలు కూడా కదులుతున్న రైలు నుండి చెత్తను బయట పడవేయడం వల్ల పట్టాల దగ్గర నివసించే ప్రజలకు, పంట పొలాలకు హాని జరుగుతుందని తెలుసు. అలాంటిది, బాధ్యతాయుతమైన రైల్వే ఉద్యోగే స్వయంగా ఇలాంటి చర్యకు పాల్పడటంపై నెటిజన్లు తీవ్రంగా మండిపడుతున్నారు.

ప్రజల దృష్టిలో ‘స్వచ్ఛ భారత్’ మిషన్ కింద రైల్వేలు చేపడుతున్న కార్యక్రమాలకు ఈ చర్య విరుద్ధంగా ఉందని, సదరు ఉద్యోగిపై రైల్వే అధికారులు తక్షణమే చర్యలు తీసుకోవాలని డిమాండ్లు వెల్లువెత్తుతున్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *