R. Krishnaiah: బీసీల హక్కులు, రిజర్వేషన్లు కోసం జీవితాంతం పోరాడతానని బీసీ సంఘాల నేత, రాజ్యసభ సభ్యుడు ఆర్. కృష్ణయ్య స్పష్టం చేశారు. బీసీలకు రాజ్యాధికారం కల్పించడమే తన చివరి కోరిక అని తెలిపారు.
గురువారం మీడియాతో మాట్లాడుతూ, బీసీ ఉద్యమం తెలంగాణ నేల నుంచే మొదలైందని కృష్ణయ్య గుర్తుచేశారు. రిజర్వేషన్లు సాధించే వరకు తమ పోరాటం ఆగదని చెప్పారు.
ఇటీవల జరిగిన బీసీ బంద్ సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా 350 మందిని పోలీసులు అక్రమంగా అరెస్టు చేశారని ఆరోపిస్తూ ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. శాంతియుతంగా తమ హక్కుల కోసం పోరాడుతున్న వారిని అదుపులోకి తీసుకోవడం ప్రభుత్వ దుర్వినియోగమని విమర్శించారు.
బీసీలకు 42% రిజర్వేషన్లు సాధించడమే లక్ష్యంగా బీసీ జేఏసీని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. బీసీల ఐక్యంతోనే రాజ్యాధికారం సాధ్యమవుతుందని, వెనక్కి తగ్గే ప్రశ్నే లేదని ధృవీకరించారు.

