Ramya Moksha

Ramya Moksha: ఇంకా నిబ్బా నిబ్బీలా ప్రవర్తిసాడు.. పోతు పోతు బాంబు పేల్చిన రమ్య

Ramya Moksha: బిగ్ బాస్ హౌస్‌లో ఎప్పుడూ ఊహించని పరిణామాలు జరుగుతుంటాయి. సీజన్ 9లో కూడా అదే కొనసాగుతోంది. తాజాగా శ్రీజ దమ్ము అన్‌ఫెయిర్ ఎలిమినేషన్‌తో ప్రేక్షకులు ఆగ్రహంగా ఉండగా, ఇప్పుడు మరో వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్ ఎలిమినేషన్ అయ్యారు. ముందు నుంచి ఊహించినట్లే ‘పచ్చళ్ల పాప’ అలియాస్ రమ్య మోక్ష బిగ్‌బాస్ హౌస్‌ నుంచి ఎలిమినేట్‌ అయ్యారు.

ఈ వారం డబుల్ ఎలిమినేషన్ జరిగినట్లు తెలుస్తోంది (అనారోగ్యంతో అయేషా బయటకు రావడం, రమ్య మోక్ష ఎలిమినేషన్).

రమ్య మోక్ష ఎలిమినేషన్‌కు కారణాలు

వైల్డ్‌కార్డ్‌గా హౌస్‌లోకి అడుగుపెట్టిన రమ్య మోక్షకు మొదట్నుంచీ ఫుల్ నెగిటివిటీ వచ్చింది. ఆమె నోటి దురుసు, అటిట్యూడ్ కారణంగా ఆడియన్స్ ఆమెను బయటకు పంపాలని నిర్ణయించుకున్నట్లు తాజా ఓటింగ్ ట్రెండ్‌లు నిరూపించాయి.

  • నోటి దురుసు: హౌస్‌లోకి వచ్చిన వెంటనే తనూజను అటాక్ చేసి, ఆమె పర్సనల్ విషయాలపై బ్యాక్ బిచింగ్ చేయడం రమ్యకు మొదటి మైనస్ పాయింట్.
  • అనవసర వ్యాఖ్యలు: తనూజ, కళ్యాణ్ రిలేషన్ గురించి అనవసర వ్యాఖ్యలు చేయడం, ఇతర కంటెస్టెంట్స్ దగ్గర అధికంగా అటిట్యూడ్ ప్రదర్శించడం ఆమెకు విపరీతమైన నెగిటివిటీని తెచ్చిపెట్టింది.
  • ఓటింగ్ ట్రెండ్: ఈ వారం నామినేషన్లలో రమ్యకు తక్కువ ఓటింగ్ పడింది. ప్రేక్షకులు ఆమెపై ఉన్న చిరాకుతో, ఆమెతో డేంజర్ జోన్‌లో ఉన్న సాయి శ్రీనివాస్‌కు ఓటింగ్ గుద్దిపడేయడంతో రమ్య ఎలిమినేషన్‌కు దారితీసింది.

ఈ వారం నామినేషన్లలో సంజన, దివ్య, తనూజ, రమ్య, సాయి, గీతూ, కల్యాణ్, రాములు ఉండగా, రమ్య మరియు సంజన చివరి వరకు డేంజర్ జోన్‌లో నిలిచారు.

నాగార్జున అడిగిన ప్రశ్నలకు రమ్య స్పందన

ఎలిమినేట్ అయిన అనంతరం నాగార్జున అడిగిన ప్రశ్నలకు రమ్య మోక్ష ఇలా సమాధానం ఇచ్చింది:

  • ఎలిమినేషన్‌పై: తను ప్రతి వారం నామినేషన్స్‌లో ఉంటానని ఫిక్స్‌ అయి వచ్చానని, కానీ ఇంత త్వరగా వెళ్తానని అనుకోలేదని తెలిపింది.
  • బిగ్ బాంబ్: హౌస్‌ నుంచి బయటకు వచ్చే ముందు, తాను చేస్తున్న వాష్‌ రూమ్‌ క్లీనింగ్‌ పనిని రీతూకి అప్పగిస్తూ రమ్య బిగ్‌ బాంబ్‌ వేసింది.

ఇది కూడా చదవండి: Montha Cyclone: వణికిస్తున్న మొంథా తుఫాను.. ఏపీ-తెలంగాణకు రెడ్ అలెర్ట్

రమ్య దృష్టిలో ఆటతీరు సరిగా లేని కంటెస్టెంట్స్:

రమ్య మోక్ష నాగార్జున సూచన మేరకు, ఆటతీరు సరిగా లేని కంటెస్టెంట్స్ ఫొటోలను చెత్తబుట్టలో వేస్తూ వారిపై తన అభిప్రాయాలను వ్యక్తం చేసింది:

కంటెస్టెంట్ రమ్య వ్యాఖ్యలు
కల్యాణ్ ఇంకా మెచ్యురిటీ లేదు. నిబ్బా నిబ్బీలా ప్రవర్తిస్తాడు. మాట్లాడటం కూడా తెలియదు.
దివ్య భరణి వెళ్లిపోయిన తర్వాత ప్రవర్తనలో మార్పు వచ్చింది. ఊరికే కోపం వస్తోంది, అది కంట్రోల్ చేసుకోవాలి.
తనూజ ఏ విషయమూ పూర్తిగా తెలియదు. ఎవరు ఏది చెబితే, అదే నిజమనుకుని మాట్లాడేస్తుంది. అందుకే నన్ను అపార్థం చేసుకుంది.
గౌరవ్ రాక్షసుడు. చెప్పిన మాట అస్సలు వినడు. తనదే ఫైనల్‌ అనుకుంటాడు. ఈగో ఎక్కువ.

రీఎంట్రీ ఊహాగానాలు: ఇప్పటికే అనారోగ్యంతో అయేషా బయటకు రావడం, ఇప్పుడు రమ్య మోక్ష ఎలిమినేట్ కావడంతో.. ఈ వారం ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్స్‌లో ఇద్దరు తిరిగి హౌస్‌లోకి రీఎంట్రీ ఇవ్వనున్నారని ఊహాగానాలు వినిపిస్తున్నాయి.

 

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *