TG Inter Exams: తెలంగాణ ఇంటర్మీడియట్ విద్యార్థులకు ముఖ్యమైన ప్రకటన వెలువడింది. 2026 విద్యాసంవత్సరానికి సంబంధించిన ఇంటర్ పరీక్షల షెడ్యూల్ను రాష్ట్ర ఇంటర్ బోర్డు ఖరారు చేసింది.
ఫిబ్రవరి 25 నుంచి పరీక్షలు మొదలై మార్చి 18వ తేదీ వరకు జరగనున్నాయి. గతేడాది మార్చి 5 నుంచి పరీక్షలు మొదలవ్వగా, ఈసారి సుమారు 8 రోజులు ముందుగానే షెడ్యూల్ను రూపొందించారు. దీనికి సీఎం రేవంత్ రెడ్డి ఆమోదం తెలిపారు. ఈ ముందస్తు నిర్వహణ వల్ల విద్యార్థులకు జేఈఈ మెయిన్స్, నీట్ వంటి జాతీయ స్థాయి ప్రవేశ పరీక్షలకు సిద్ధం కావడానికి ఎక్కువ సమయం లభిస్తుందని ముఖ్యమంత్రి అభిప్రాయపడ్డారు.
Also Read: Sabarimala Gold Theft: శబరిమల బంగారం తాపడం కేసులో కీలక మలుపు
కీలక మార్పులు, వివరాలు
ఈ ఏడాది తెలంగాణ వ్యాప్తంగా మొత్తం 9 లక్షల 50 వేల మంది విద్యార్థులు ఇంటర్ పరీక్షలు రాయనున్నారు. పరీక్షల నిర్వహణలో పారదర్శకత పెంచడానికి, విద్యార్థుల్లో భయాన్ని తగ్గించడానికి బోర్డు కొన్ని కీలక మార్పులు చేసింది:
ప్రాక్టికల్స్ కొత్త విధానం: ప్రైవేట్ కాలేజీలను మినహాయించి, కేవలం ప్రభుత్వ కాలేజీల్లోనే ఇంటర్ ప్రాక్టికల్ పరీక్షలు నిర్వహించాలని ఇంటర్మీడియట్ బోర్డు నిర్ణయించింది. ప్రతి ఏటా సుమారు 4.20 లక్షల మంది విద్యార్థులు ఈ ప్రాక్టికల్స్కు హాజరవుతారు.
సిలబస్ సవరణ: ఈసారి 12 ఏళ్ల తర్వాత ఇంటర్మీడియట్ సిలబస్ను బోర్డు మార్చింది. ఈ మార్పులకు సంబంధించిన వివరాలు త్వరలో వెల్లడి కానున్నాయి.
ఫీజు చెల్లింపు: విద్యార్థులు నవంబర్ 1వ తేదీ నుంచి పరీక్షా ఫీజు చెల్లించవచ్చు అని ఇంటర్ బోర్డు సెక్రటరీ కృష్ణ ఆదిత్య తెలిపారు.
ఈ పరీక్షల తేదీలు, ప్రాక్టికల్స్ విధానం, సిలబస్లో చేసిన మార్పులపై పూర్తి వివరాలను వెల్లడించడానికి ఇంటర్ బోర్డు అధికారులు శనివారం (అక్టోబర్ 25) మీడియా సమావేశం నిర్వహించనున్నారు.
📢 Big update for #Inter students in #Telangana!
Chief Minister & Education Minister A Revanth Reddy has advanced the #Telangana #Intermediate Public Exams 2026 to February 25, 2026, ensuring students get more time to prepare for major entrance tests — #JEEMain, #JEEAdvanced,…
— L Venkat Ram Reddy (@LVReddy73) October 24, 2025

