షూటింగ్ పూర్తి చేసుకున్న’ లైఫ్ (లవ్ యువర్ ఫాదర్)’మూవీ

శ్రీహర్ష, కషిక కపూర్ జంటగా తెరకెక్కుతున్న సినిమా లైఫ్(లవ్ యువర్ ఫాదర్).
మనీషా ఆర్ట్స్ అండ్ మీడియా ప్రైవేట్ లిమిటెడ్, అన్నపరెడ్డి స్టూడియోస్ పై కిషోర్ రాఠీ, మహేష్ రాఠీ, ఏ. రామస్వామి రెడ్డిలు సంయుక్తంగా ఈ సినిమాని నిర్మిస్తున్నారు. పవన్ కేతరాజు దర్శకత్వం వహిస్తున్నారు. మణిశర్మ సంగీతం సమకూరుస్తున్న ఈ సినిమా షూటింగ్ బుధవారం పూర్తయింది. ఈ సందర్భంగా మూవీ టీం మీడియాతో ముచ్చటించింది.

“కొడుకు బాధ్యత తీర్చేందుకు తండ్రి పడే ఆరాటం.. తండ్రి కోసం కొడుకు చేసే పోరాటం.. మా ఈ లైఫ్ సినిమా.  అని దర్శకుడు పవన్ కేతరాజు తెలిపారు .  “కథ అంతా కాశి బ్యాక్ డ్రాప్ లో జరుగుతూ శివతత్వాన్ని చూపించే చిన్న ప్రయత్నం చేశాం. ఒక మంచి ఫ్యామిలీ ఎంటరటైనర్ సినిమాగా ఈ సినిమాని తీస్తున్నాం. హీరో శ్రీహర్ష మొదటి సినిమా అయినా చాలా బాగా నటించాడు. హీరో తండ్రి పాత్రలో ఎస్పి చరణ్ ఈ సినిమాకి చాలా ప్లస్ అయ్యారు. రఘు బాబు, షకలక శంకర్, ప్రవీణ్ కామెడీ టైమింగ్ చాలా బాగుంటుంది. శ్యామ్ కె నాయుడు సినిమాటోగ్రఫీ విజువల్ వండర్ లా ఉంటుంది. ఈ సినిమా విజువల్స్ ఇంత గ్రాండ్ గా ఉన్నాయంటే శ్యామ్ వల్లే. అదేవిధంగా మణిశర్మ ఇచ్చిన మ్యూజిక్ సినిమాకి హైలైట్ గా నిలుస్తుంది. అన్ని పాటలు చాలా మేలోడి గా ఇచ్చారు. క్లైమాక్స్, బిజియం కథకి హైలైట్. కషిక కపూర్ చాలా బాగా నటించింది. ఖచ్చితంగా ఈ సినిమా ప్రేక్షకులకు నచ్చుతుందని ఆశిస్తున్నాను” అంటూ సినిమా విశేషాలను పంచుకున్నారు దర్శకుడు .

కొరియోగ్రాఫర్ మోయిన్ మాట్లాడుతూ.. “ఈ సినిమాలో 5 సాంగ్స్ నేనే కొరియోగ్రఫీ చేశాను. నన్ను నమ్మి సింగిల్ కార్డ్ కొరియోగ్రఫీ అవకాశం ఇచ్చిన మా డైరెక్టర్ గారికి ప్రొడ్యూసర్స్ కి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. కచ్చితంగా ఈ సినిమా పెద్ద హిట్ అవుతుందని నమ్ముతున్నాను” అని చెప్పారు.
“ఈ సినిమాలో నాకు అవకాశం ఇచ్చిన మా డైరెక్టర్ కి ప్రొడ్యూసర్స్ కి కృతజ్ఞతలు చెప్పారు హీరోయిన్ కషిక కపూర్. ఆమె మాట్లాడుతూ.. “కిషోర్ రాఠీ, మహేష్ రాఠీ గారు ప్రొడక్షన్ వైస్ చాలా మంచి సపోర్ట్ ఇచ్చారు. డైరెక్టర్ పవన్ చెప్పిన కథ చాలా బాగుంది. తండ్రికి కొడుకు కి మధ్య ఉండే  అనుబంధాన్ని చాలా బాగా చూపిస్తున్నారు. ప్రేక్షకులందరికీ ఈ సినిమా నచ్చుతుందని ఆశిస్తున్నాను” అని పేర్కొన్నారు. ” లైఫ్… తండ్రి కొడుకుల మధ్య బంధాన్ని చూపించే ఒక మంచి సినిమా అని హీరో శ్రీహర్ష అన్నారు .   ఈరోజు ఈ సినిమా షూటింగ్ లాస్ట్ డే అని చెప్పారు .   సినిమా అయితే చాలా బాగా వచ్చింది. కచ్చితంగా అందరికీ నచ్చుతుందని ఆశిస్తున్నాను” అంటూ శీహర్ష ఆశాభావం వ్యక్తం చేశారు .

నిర్మాత అన్నపరెడ్డి రామస్వామి రెడ్డి మాట్లాడుతూ…” ఆరు నెలల క్రితం ఈ సినిమా షూటింగ్ స్టార్ట్ చేశాం. నేటితో షూటింగ్ మొత్తం కంప్లీట్ చేసుకున్నాం. సినిమా చాలా అద్భుతంగా వచ్చింది. డైరెక్టర్ పవన్ గారు, సినిమాటోగ్రఫీ శ్యామ్ గారు, మ్యూజిక్ మణిశర్మ గారు చాలా కష్టపడ్డారు. సినిమా ఎక్కువ శాతం కాశీలో షూట్ చేసాం. దైవత్వంతో పాటు తండ్రి కొడుకులు మధ్య ఉన్న బంధాన్ని కూడా చాలా బాగా చూపిస్తున్నాం. సినిమాలో నటించిన ప్రతి ఒక్కరూ ఇష్టపడి నటించారు. మా మూవీ టీమ్ అందరికీ ఇంత అద్భుతమైన ప్రాజెక్ట్ పూర్తి చేసినందుకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. త్వరలో ప్రేక్షకులు ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాం. కచ్చితంగా ఈ సినిమా ప్రేక్షకులకు నచ్చుతుంది అని నమ్మకంతో ఉన్నాము” అని అన్నారు. కాగా, ఈ సినిమాలో ఎస్. పి. చరణ్, నవాబ్ షా, ప్రవీణ్, భద్రం, రఘుబాబు, షకలక శంకర్, రియా, సంధ్య ఇతర ముఖ్య పాత్రల్లో నటించారు. అతి త్వరలో ఈ సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తామని మేకర్స్ చెప్పారు.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *