Gagandeep

Gagandeep: డోపింగ్‌కు పాల్పడినందుకు గగన్ దీప్‌పై మూడేళ్ల నిషేధం

Gagandeep: నేషనల్ గేమ్స్‌లో స్వర్ణం సాధించిన అథ్లెట్ గగన్ దీప్ డోపింగ్‌కు పాల్పడినట్లు తేలడంతో అతడిపై మూడేళ్ల నిషేధం విధించారు. అతడితో పాటు మరో ఇద్దరు అథ్లెట్లపైనా కూడా నిషేధం విధించినట్లు నేషనల్ యాంటీ డోపింగ్ ఏజెన్సీ (NADA) ప్రకటించింది. గగన్ దీప్ డిస్కస్ త్రో క్రీడాకారుడు. అతను టెస్టోస్టెరాన్ మెటాబోలైట్స్ అనే నిషేధిత పదార్థాలను ఉపయోగించినట్లు పరీక్షలలో తేలింది. నిబంధనల ప్రకారం డోపింగ్‌కు పాల్పడిన మొదటిసారి నేరం చేస్తే సాధారణంగా నాలుగేళ్ల నిషేధం విధించబడుతుంది. అయితే, గగన్ దీప్ నేరాన్ని అంగీకరించి, NADA నిబంధనల ప్రకారం శిక్షను అంగీకరించినందున, అతడి నిషేధాన్ని ఒక సంవత్సరం తగ్గించారు. అతనిపై నిషేధం 2025 ఫిబ్రవరి 19 నుంచి అమల్లోకి వస్తుంది.

Also Read: Jasprit Bumrah: ఆసియా కప్ టీ20 స్వ్కాడ్‌లో జస్‌ప్రీత్ బుమ్రా..

ఈ నిషేధం కారణంగా, గగన్ దీప్ తన క్రీడా జీవితంలో ప్రధాన టోర్నమెంట్లు, పోటీలలో పాల్గొనలేడు. ఈ నిషేధం కారణంగా, అతను ఉత్తరాఖండ్ నేషనల్ గేమ్స్‌లో గెలుచుకున్న స్వర్ణ పతకాన్ని వెనక్కి తీసుకోనున్నారు. ఈ పతకం ఇప్పుడు హర్యానాకు చెందిన నిర్భయ్ సింగ్‌కు లభిస్తుందని భావిస్తున్నారు. గగన్ దీప్‌తో పాటు, సచిన్ కుమార్, జైను కుమార్ వంటి ఇతర ట్రాక్ అండ్ ఫీల్డ్ అథ్లెట్లు కూడా ఇదే నిబంధన కింద మూడేళ్ల నిషేధాన్ని పొందారు. కాగా ఇటీవల జరిగిన ఉత్తరాఖండ్ నేషనల్ గేమ్స్‌లో పురుషుల డిస్కస్ త్రోలో స్వర్ణ పతకం సాధించాడు. ఈ పోటీలో అతని అత్యుత్తమ త్రో 55.01 మీటర్లు. అతను సర్వీసెస్ జట్టుకు ప్రాతినిధ్యం వహించాడు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *