Jagga reddy: కాంగ్రెస్ కార్యకర్తల్లో అసంతృప్తి ఉంది 

Jagga reddy: తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం బీ ఆర్ ఎస్ పాలన కంటే మెరుగ్గానే ఉందని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి అన్నారు. అయితే, కార్యకర్తల్లో అసంతృప్తి ఉందని స్పష్టం చేశారు. మంగళవారం జరిగిన తెలంగాణ కాంగ్రెస్ పొలిటికల్ అఫైర్స్ కమిటీ (PAC) సమావేశంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

సీఎం రేవంత్ రెడ్డి, ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్కతో పాటు మంత్రుల కృషిని కొనియాడిన జగ్గారెడ్డి, వారి కష్టాలు వృథా కాకుండా ఉండాలంటే క్షేత్రస్థాయిలో పనిచేస్తున్న కార్యకర్తలను ప్రోత్సహించాల్సిన అవసరం ఉందన్నారు. పార్టీ కార్యకర్తలకు ప్రాధాన్యత ఇవ్వకపోతే, పార్టీ బలోపేతం కావడం కష్టం అని చెప్పారు.

జగదీష్ రెడ్డి వంటి నిభర్తులపై మండిపడిన ఆయన, వారి వంటి నేతలకు తగిన ఆర్థిక సహాయం, గుర్తింపు అవసరమని సూచించారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో విజయాన్ని సాధించాలంటే, కార్యకర్తల ఆర్థిక, మానసిక స్థితిని బలోపేతం చేయడం తప్పనిసరిగా ఉందని పీఏసీకి కీలక సలహాలు ఇచ్చారు.

ఈ వ్యాఖ్యలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎలా స్పందిస్తారో ఆసక్తికరంగా మారింది.

 

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *