OG: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న భారీ యాక్షన్ ఎంటర్టైనర్ ‘ఓజి’ చిత్రం రిలీజ్కు సిద్ధమవుతోంది. సుజీత్ దర్శకత్వంలో ప్రియాంక అరుళ్ మోహన్ హీరోయిన్గా రూపొందుతున్న ఈ సినిమా షూటింగ్ దాదాపు పూర్తయింది. ఇప్పుడు ఈ చిత్రం బిజినెస్ విషయంలో సంచలన వార్తలు వినిపిస్తున్నాయి. సీడెడ్ ప్రాంత హక్కుల కోసం యువ నిర్మాత నాగవంశీ భారీ మొత్తం చెల్లించి సొంతం చేసుకున్నట్లు సమాచారం.
Also Read: Kannappa: ‘కన్నప్ప’ సినిమాకు సెన్సార్ అడ్డంకులు!
OG: అదే సమయంలో ఆంధ్రప్రదేశ్లోని ఇతర ప్రాంతాల రైట్స్ను మరో ప్రముఖ నిర్మాత రూ. 80 కోట్లకు పైగా ధరకు కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. ఏపీలో ‘ఓజి’ బిజినెస్ ఊహించని స్థాయిలో జరుగుతూ అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఏ స్థాయిలో సందడి చేస్తుందో చూడాలి!