Pm modi: ప్రజలు మార్పు కోసం ఎదురుచూస్తున్నారు..

Pm modi: పశ్చిమ బెంగాల్‌లో అవినీతి, హింస పెరిగిపోతున్నాయని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ మండిపడ్డారు. రాష్ట్రాన్ని తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) ప్రభుత్వంపాటు విముక్తం చేయాల్సిన సమయం వచ్చిందని చెప్పారు. అలిపుర్‌దువార్‌లో నిర్వహించిన బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ, “ఇక్కడి ప్రజలు మార్పు కోసం ఎంతగానో ఎదురుచూస్తున్నారు” అని వ్యాఖ్యానించారు.

మోదీ వ్యాఖ్యలపై బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తీవ్రంగా స్పందించారు. అఖిలపక్ష ఎంపీల బృందం విదేశాల్లో ఉగ్రవాదంపై పోరాటం సందేశంతో పర్యటిస్తున్న తరుణంలో, ప్రధాని నుంచి ఇలాంటి విమర్శలు రావడం తగదన్నారు.

మరోవైపు, మోదీ అలిపుర్‌దువార్ సభలో మాట్లాడుతూ, బెంగాల్‌లో ప్రభుత్వ తీరును తీవ్రంగా విమర్శించారు. ముర్షిదాబాద్, మాల్దా జిల్లాల్లో జరిగిన అల్లర్లను ఉదాహరించి, “తృణమూల్ ప్రభుత్వం ప్రజలపై గూండాలను ఉసిగొల్పుతోంది. ఇది ప్రజాస్వామ్యానికి విరుద్ధం” అన్నారు. ప్రతి అంశంలో కోర్టుల జోక్యం అవసరమవుతుండడం దురదృష్టకరమని చెప్పారు.

 

 

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *