Operation Keller

Operation Keller: అగ్నివీర్‌ మురళీనాయక్‌ మృతికి భారత్‌ ప్రతీకారం

Operation Keller: జమ్మూ కశ్మీర్‌లోని పహల్గాం ఉగ్రదాడి భారత గుండెల్లో రగిలించిన మంటలు ఇంకా ఆరలేదు. ఈ దాడికి ప్రతీకారంగా భారత త్రివిధ దళాలు మే 7, 2025న ‘ఆపరేషన్ సిందూర్’ పేరిట పాకిస్థాన్, పాక్ ఆక్రమిత కశ్మీర్‌లోని ఉగ్ర శిబిరాలపై మెరుపు దాడులు చేసి, 100 మంది కరడుగట్టిన తీవ్రవాదులతో పాటు పదుల సంఖ్యలో పాక్ సైనికులను హతమార్చాయి. పాకిస్థాన్ కూడా ఈ నష్టాన్ని దాదాపు ఒప్పుకుంది. అయితే, పాక్ ప్రోత్సాహంతో ఉగ్రవాదులు భారత సైన్యంపై దాడులను కొనసాగిస్తూనే ఉన్నారు. ఈ క్రమంలో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన వీర జవాన్ మురళి నాయక్, పోషియాన్ ప్రాంతంలో జరిగిన ఉగ్రదాడిలో వీరమరణం పొందారు. ఈ ఘటన భారత సైన్యాన్ని కలిచివేసింది. మురళి నాయక్ త్యాగం వృధా కాదంటూ, భారత సైన్యం తాజాగా ‘ఆపరేషన్ కెల్లార్’ పేరిట పాక్ ఉగ్రవాదానికి ఘాటైన జవాబు చెప్పింది.

మే 13, 2025.. మంగళవారం ఉదయం జమ్మూ కశ్మీర్‌లోని షోపియాన్ జిల్లాలోని కెల్లార్ అటవీ ప్రాంతంలో ఈ ఆపరేషన్ ప్రారంభమైంది. నిఘా వర్గాల నుంచి నలుగురు కరడుగట్టిన ఉగ్రవాదులు ఈ ప్రాంతంలో సంచరిస్తున్నట్లు సమాచారం అందడంతో, ఇండియన్ ఆర్మీ, జమ్మూ కశ్మీర్ పోలీసులు, రాష్ట్రీయ రైఫిల్స్ సంయుక్తంగా ఈ ఆపరేషన్‌ను చేపట్టాయి. కెల్లార్‌లో నిర్బంధ తనిఖీలు నిర్వహిస్తుండగా, ఉగ్రవాదులు భారత సైన్యాన్ని చూసిన వెంటనే భారీగా కాల్పులకు తెగబడ్డారు. అయితే, భారత సైనికులు అసాధారణ ధైర్యంతో ఈ కాల్పులను తిప్పికొట్టి, ముగ్గురు ఉగ్రవాదులను మట్టుబెట్టారు. హతమైన ఈ ఉగ్రవాదులు లష్కర్-ఎ-తొయిబాకు చెందిన కీలక సభ్యులుగా గుర్తించారు.

పోషియాన్ ప్రాంతం జమ్మూ కశ్మీర్‌లో అత్యంత సున్నితమైన లైన్ ఆఫ్ కంట్రోల్ (ఎల్‌ఓసీ) సమీపంలో ఉంది. ఇక్కడ పనిచేసే భారత సైనికులు నిత్యం ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని దేశ రక్షణ కోసం పోరాడుతుంటారు. పాక్ ప్రేరేపిత ఉగ్రవాదులు ఈ ప్రాంతంలో నిరంతరం దాడులకు పాల్పడుతూ, శాంతిని భగ్నం చేస్తుంటారు. ఇదే ప్రాంతంలో రక్షణ విధుల్లో ఉన్న మురళి నాయక్‌ను ఉగ్రవాదులు బలితీసుకోవడం సైన్యంలో ఆగ్రహాన్ని రగిలించింది. ఈ నేపథ్యంలో, ఆపరేషన్ కెల్లార్‌లో భాగంగా ముగ్గురు ఉగ్రవాదులను హతమార్చడం ద్వారా భారత సైన్యం తన సత్తా చాటింది. “మా జవాన్ల త్యాగం వృథా కాదు. ప్రతి దాడికీ ఘాటైన జవాబు ఉంటుంది” అని రాష్ట్రీయ రైఫిల్స్ అధికారి ఒకరు ఉద్వేగంతో పేర్కొన్నారు.

Also Read: BSF jawan: భారత బీఎస్‌ఎఫ్‌ జవాన్‌ను అప్పగించిన పాక్‌..!

Operation Keller: ఈ ఆపరేషన్ కేవలం ప్రతీకారం కోసం మాత్రమే కాదు, దేశ భద్రతను కాపాడేందుకు భారత సైన్యం చేస్తున్న అవిశ్రాంత కృషికి నిదర్శనం. ఆపరేషన్ సిందూర్‌తో పాక్‌కు గట్టి హెచ్చరిక జారీ చేసిన భారత సైన్యం, ఇప్పుడు ఆపరేషన్ కెల్లార్‌తో ఉగ్రవాదాన్ని ఊపిరి సలపనివ్వకుండా అణచివేస్తోంది. మే 10న భారత్-పాకిస్థాన్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం జరిగినప్పటికీ, పాక్ ఉగ్రవాదులు దాడులను ఆపలేదు. ఈ నేపథ్యంలో, కెల్లార్‌లో జరిగిన ఎన్‌కౌంటర్ కాల్పుల విరమణ తర్వాత జరిగిన తొలి పెద్ద ఆపరేషన్‌గా నిలిచింది. కుల్గామ్, షోపియాన్ ప్రాంతాల్లో మూడు గంటలకు పైగా కొనసాగిన ఈ భీకర కాల్పుల్లో భారత సైనికులు అసమాన ధైర్యాన్ని ప్రదర్శించారు.

ALSO READ  The Suspect: సెన్సార్ పూర్తి చేసుకుని రిలీజ్ కి రెడీగా ఉన్న ‘ది సస్పెక్ట్’!

ఆపరేషన్ కెల్లార్ ఇంకా కొనసాగుతోంది. మరో ఉగ్రవాది ఈ ప్రాంతంలో దాక్కున్నట్లు సమాచారం ఉండడంతో, సైన్యం అప్రమత్తంగా గాలింపు కొనసాగిస్తోంది. “మురళి నాయక్‌ లాంటి వీరుల త్యాగం మమ్మల్ని మరింత ఉత్తేజపరుస్తోంది. ఉగ్రవాదాన్ని రూపుమాపే వరకు మా పోరాటం ఆగదు,” అని ఆపరేషన్‌లో పాల్గొన్న ఓ సైనికుడు ఉద్వేగంతో చెప్పారు. ఈ ఆపరేషన్ ద్వారా భారత సైన్యం పాక్‌కు మరోసారి స్పష్టమైన సందేశం పంపింది.

 

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *