Allu Aravind: శ్రీతేజ్ పరామర్శకు అల్లు అరవింద్

Allu aravind: అల్లు అర్జున్ నటించిన ‘పుష్ప-2’ సినిమా విడుదల సందర్భంగా సంధ్య థియేటర్ వద్ద జరిగిన దురదృష్టకర ఘటనలో గాయపడిన చిన్నారి శ్రీతేజ్‌ను ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ పరామర్శించారు. సంఘటన తరువాత నెలలపాటు ఆసుపత్రిలో చికిత్స పొందిన శ్రీతేజ్ ఇటీవలే డిశ్చార్జ్ అయి, ప్రస్తుతం రీహాబిలిటేషన్ సెంటర్‌లో చికిత్స పొందుతున్న విషయం తెలిసిందే.

ఈ నేపథ్యంలో అల్లు అరవింద్ స్వయంగా రీహాబ్ సెంటర్‌కు వెళ్లి శ్రీతేజ్‌ను కలుసుకున్నారు. చిన్నారి ఆరోగ్య పరిస్థితి గురించి వైద్యుల్ని అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, “శ్రీతేజ్ ఆరోగ్యం క్రమంగా మెరుగుపడుతుండటం చాలా సంతోషంగా ఉంది. మా కుటుంబం అతడి పూర్తిస్థాయి కోలుకోకును ఎంతో ఆశతో ఎదురుచూస్తోంది. వైద్యులు చెప్పిన ప్రకారం చిన్నారి చికిత్సకు బాగా స్పందిస్తున్నాడు” అని తెలిపారు.

చిన్నారి వైద్య ఖర్చుల కోసం హీరో అల్లు అర్జున్ ఇప్పటికే రూ. 2 కోట్లు ఆర్థికంగా సహాయం చేసిన విషయాన్ని అల్లు అరవింద్ ఈ సందర్భంగా గుర్తు చేశారు. శ్రీతేజ్ చికిత్సలో ఎలాంటి అడ్డంకులు రాకుండా చూసేందుకు అల్లు కుటుంబం పూర్తి మద్దతుగా నిలుస్తోంది.

ఈ పరామర్శకు నిర్మాత బన్నీ వాసు కూడా అల్లు అరవింద్‌కు తోడుగా పాల్గొన్నారు. చిన్నారి పూర్తి కోలుకోవాలని అభిమానులు, సినీ ప్రముఖులు కోరుకుంటున్నారు. అల్లు కుటుంబం చూపిన ఈ మానవీయత మరోసారి ప్రజల గుండెల్లో చోటు దక్కించుకుంది.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *