Srisailam: శ్రీశైలం జలాశయానికి కొనసాగుతున్న వరద ఉదృతి ప్రాజెక్టు 4 గేట్లు 10 అడుగుల మేర ఎత్తివేశారు డ్యామ్ గేట్లపై నుంచి కృష్ణమ్మ నాగార్జునసాగర్ వైపు పరుగులు పెడుతుంది డ్యామ్ 4 రేడియల్ క్రస్ట్ గేట్లు ద్వారా 1లక్ష 11 వేల 932 క్యూసెక్కుల వరదనీరు దిగువ నాగార్జునసాగర్ కు డ్యామ్ అధికారులు విడుదల చేస్తున్నారు అయితే ఎగువ పరీవాహక ప్రాంతాలైన జూరాల నుంచి 1లక్ష 18 వేల 464 క్యూసెక్కుల వరదనీరు సుంకేసుల నుంచి 72, వేల114 క్యూసెక్కుల హంద్రీ నుంచి 250 క్యూసెక్కుల వరదనీరు శ్రీశైలం జలాశయానికి వచ్చి చేరుతుంది దీనితో వరద ఉదృతి కొనసాగుతుంది జలాశయం 4 గేట్లు 10 అడుగుల మేర ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు శ్రీశైలం జలాశయానికి మొత్తంగా ఇన్ ఫ్లోగా 1 లక్ష 90 వేల 828 క్యూసెక్కులు ఉండగా అవుట్ ఫ్లో 1 లక్ష 79 వేల 971 క్యూసెక్కులుగా ఉంది శ్రీశైలం జలాశయం పూర్తిస్దాయి నీటిమట్టం 885 అడుగులు కాగా ప్రస్తుతం 884.70 అడుగులగా ఉంది పూర్తిస్థాయి నీటినిల్వ సామర్థ్యం 215.8070 టీఎంసీలు కాగా ప్రస్తుతం 213.8824 టీఎంసీలుగా నమోదైంది శ్రీశైలం కుడి ఎడమగట్టు జలవిద్యుత్ కేంద్రాలలో విద్యుత్ ఉత్పత్తి పూర్తిస్థాయిలో కొనసాగుతుంది.

