Mumbai: బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్కు మరోమారు బెదిరింపులు వచ్చినట్లు తెలుస్తోంది. లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్తో ఉన్న శత్రుత్వం సమాప్తం కావాలంటే రూ.5 కోట్లు ఇవ్వాలని అగంతుకులు డిమాండ్ చేశారు.
అదాంతకులు చేసిన మెసేజ్ లో ఇలా ఉంది.”ఈ బెదిరింపులను ఎట్టిపరిస్థితుల్లోనూ తేలిగ్గా తీసుకోవద్దు. సల్లూ భాయ్ ప్రాణాలతో ఉండాలన్నా, లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్తో వైరానికి ముగింపు పలకాలన్నా ఆయన రూ. 5 కోట్లు ఇవ్వాలి. ఈ నగదు ఇవ్వకుంటే మాజీ ఎమ్మెల్యే సిద్ధిఖీ కంటే దారుణమైన పరిస్థితులు చూడాల్సి వస్తుంది” అని మెసేజ్ లో తెలిపారు
ఈ మేరకు ముంబయి ట్రాఫిక్ పోలీసుల వాట్సప్ నంబర్కు గురువారం రాత్రి ఓ సందేశం వచ్చింది. దాంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. ఈ బెదిరింపులపై దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ఆ సందేశం ఎక్కడి నుంచి వచ్చిందనే విషయమై విచారణ చేస్తున్నట్లు చెప్పారు
.

