Bengaluru: నిన్న కురిసిన వానలకు ఐటీ కారిడార్ నీటమునిగింది. రోడ్లపై వరదనీరు నిలిచి ఉన్న వీడియోలు వైరల్ అవుతున్నాయి. కొన్ని కంపెనీలు ఉద్యోగులకు ఇవాళ వర్క్ ఫ్రమ్ హోం ప్రకటించాయి. సిటీలోని స్కూళ్లు, కాలేజీలకు ఇవాళ సెలవు ప్రకటించారు. నేటి నుంచి వర్షాలు మరింత జోరందుకుంటాయని వాతావరణశాఖ తెలిపింది. బెంగళూరుకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది.

