ఏపీలోని జిల్లాలకు ఇంఛార్జ్ మంత్రులను ప్రభుత్వం నియమించింది. అయితే పాత జిల్లాల వారీగా కాకుండా కొత్త ఉమ్మడి జిల్లాల వారీగానే జిల్లాలకు ఇంఛార్జ్లను నియమిస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. 22 జిల్లాలకు 22 మంది మంత్రులను ఇంఛార్జ్లుగా నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. మరోవైపు.. ఎన్నికల వేళ ఇచ్చిన హామీలను అమలు చేసేందుకు.. ప్రభుత్వ పథకాలు, పాలనను ప్రజలకు అందించేందుకు ఈ ఇంఛార్జ్ మంత్రులు చొరవ తీసుకోనున్నారు. ఏ జిల్లాకు a మంత్రి అంటే..
శ్రీకాకుళం – కొండపల్లి శ్రీనివాస్
పార్వతీపురం మన్యం, కోనసీమ – అచ్చెన్నాయుడు
విజయనగరం – వంగలపూడి అనిత
విశాఖ – డోలా బాలవీరాంజనేయస్వామి
అల్లూరి – గుమ్మడి సంధ్యారాణి
అనకాపల్లి – కొల్లు రవీంద్ర
కాకినాడ – పొంగూరు నారాయణ
తూ.గో, కర్నూలు – నిమ్మల రామానాయుడు
ఏలూరు – నాదెండ్ల మనోహర్
ప.గో, పల్నాడు – గొట్టిపాటి రవికుమార్
ఎన్టీఆర్ – సత్యకుమార్ యాదవ్
కృష్ణా – వాసంశెట్టి సుభాష్
గుంటూరు – కందుల దుర్గేష్
బాపట్ల – కొలుసు పార్థసారథి
ప్రకాశం – ఆనం రామనారాయణరెడ్డి
నెల్లూరు – ఎన్ఎండీ ఫరూఖ్
నంద్యాల – పయ్యావుల కేశవ్
అనంతపురం – టీజీ భరత్
శ్రీసత్యసాయి, తిరుపతి – అనగాని సత్యప్రసాద్
కడప – ఎస్.సవిత
అన్నమయ్య – బీసీ జనార్దన్రెడ్డి
చిత్తూరు – మండిపల్లి రామ్ప్రసాద్ రెడ్డి