Fadnivas: సైఫ్ అలీ ఖాన్ కేసు.. సీఎం ఫన్నీ వాస్ కామెంట్స్ ఇవే..

Fadnivas: బాలీవుడ్ నటుడు సైఫ్ అలీఖాన్‌పై దాడి అంశంపై మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ స్పందించారు. ముంబైలో మీడియాతో మాట్లాడిన ఆయన, ఈ కేసుకు సంబంధించి అన్ని వివరాలను ముంబై నగర పోలీస్ కమిషనర్ ఈ రోజు లేదా రేపు మీడియాకు తెలియజేస్తారని వెల్లడించారు.

ఈ కేసుపై అనవసర ఊహాగానాలు చేయకుండా, పోలీసుల విచారణలో వెల్లడించని అంశాలపై ఎవరూ గందరగోళం సృష్టించవద్దని ఫడ్నవీస్ సూచించారు. కేసు దర్యాఫ్తు పూర్తిగా కొనసాగుతోందని తెలిపారు.

తదుపరి ఆయన మాట్లాడుతూ, భారతదేశంలో కేంద్ర ప్రభుత్వం ఆశించినట్లు సాక్ష్యాధార వ్యవస్థను అమలు చేసిన తొలి రాష్ట్రంగా మహారాష్ట్ర నిలిచిందని పేర్కొన్నారు. మొబైల్ ఫోరెన్సిక్ వ్యాన్‌ను ప్రారంభించినట్లు తెలిపారు. ఈ వాహనాలు ఫోరెన్సిక్ నిపుణులతో కలిపి ఏ ఘటన జరిగినా సంబంధిత కేసుకు సంబంధించిన ఆధారాలను సేకరిస్తాయని వివరించారు. ఆధారాలను ఎవ్వరూ తారుమారు చేయలేని పరిస్థితి ఏర్పడిందని చెప్పారు. ఈ వ్యాన్లను అన్ని పోలీస్ స్టేషన్‌లలో అందుబాటులో ఉంచుతామని ఆయన వెల్లడించారు.

 

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *