Flag Hoisting: జాతీయ జెండాను ఎగురవేసేందుకు ప్రిన్సిపాల్ మద్యం మత్తులో పాఠశాలకు వెళ్లినట్లు ఫిర్యాదు
అందింది. విషయం తెలుసుకున్న పోలీసు వెంటనే అతడిని అరెస్ట్ చేశారు.
బీహార్లోని ముజఫర్పూర్ జిల్లాలో గణతంత్ర దినోత్సవం సందర్భంగా జాతీయ జెండాను ఎగురవేసేందుకు వెళ్లిన ప్రభుత్వ పాఠశాల ప్రధానోపాధ్యాయుడిని పోలీసులు అరెస్టు చేశారు.పోలీసులు చెప్పిన సమాచారం ప్రకారం.. అరెస్టయిన ప్రధానోపాధ్యాయుడు సంజయ్ కుమార్ సింగ్ మీనాపూర్ ప్రాంతంలోని ధరంపూర్ ఈస్ట్ ప్రభుత్వ మిడిల్ స్కూల్లో పనిచేస్తున్నారని పోలీసులు తెలిపారు.
ప్రధానోపాధ్యాయుడు మద్యం మత్తులో పాఠశాలకు చేరుకోవడంతో స్థానిక ప్రజలు మీనాపూర్ ఎమ్మెల్యే మున్నా యాదవ్కు సమాచారం అందించగా, వారు విషయాన్ని పోలీసుల దృష్టికి తీసుకెళ్లారు. రాంపూర్హరి పోలీస్స్టేషన్ ఇన్ఛార్జ్ సుజిత్కుమార్ విలేకరులతో మాట్లాడుతూ.. జాతీయ జెండాను ఎగురవేసేందుకు ప్రిన్సిపాల్ మద్యం మత్తులో పాఠశాలకు వెళ్లినట్లు ఫిర్యాదు అందింది. విషయం తెలుసుకున్న పోలీసు బృందం వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. ‘బ్రీత్ ఎనలైజర్ టెస్ట్’లో కూడా మద్యం సేవించినట్లు నిర్ధారించారు. పోలీసులు అతన్ని అరెస్ట్ చేశారు.
ఇది కూడా చదవండి: Sheesh Mahal: ధరలతో సహా కేజ్రీవాల్ ఇంటి కొత్త వీడియోను విడుదల చేసిన BJP.. మొత్తం ఎంత అంటే..
అరెస్టుకు ముందు, ప్రధానోపాధ్యాయుడు విలేఖరులతో మాట్లాడుతూ, తాను తీవ్రమైన ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నానని మరియు గత ఐదు నెలలుగా తనకు జీతం కూడా రాలేదని పేర్కొన్నారు. నితీష్ కుమార్ నేతృత్వంలోని బీహార్ ప్రభుత్వం ఏప్రిల్ 5, 2016న మద్యం అమ్మకాలు మరియు వినియోగంపై పూర్తి నిషేధాన్ని విధించింది.
