Delhi: జమిలి బిల్లుకు టీడీపీ పూర్తి మద్దతు..

Delhi: జమిలి ఎన్నికల బిల్లుకు తెలుగుదేశం పార్టీ మద్దతు తెలిపింది. ఎన్నికల ఖర్చు తగ్గించడం, వ్యవస్థను సులభతరం చేయడం వంటి అంశాలను టీడీపీ ముఖ్యంగా ప్రస్తావించింది. ఎన్డీయే కూటమిలో అతిపెద్ద పార్టీ అయిన తెలుగు దేశం పార్టీ సంపూర్ణ మద్దతు ప్రకటించినట్లు ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయులు ప్రకటించారు. దీంతో ఒక్కసారిగా సభ దద్దరిల్లింది. కేంద్ర కమ్యూనికేషన్స్ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ చెప్పినట్టు, జమిలి ఎన్నికల వల్ల ఖర్చు తగ్గడంతో పాటు ఓటర్ల పాల్గొనింపు కూడా పెరుగుతుందని వాదన వచ్చింది.

టీడీపీ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని అలా ఎలా మద్దతు తెలుపుతారని కాంగ్రెస్ సహా ఇతర పార్టీ ఎంపీలు ఆందోళన వ్యక్తం చేశారు. కాగా, ఈ బిల్లు ప్రధానంగా దేశవ్యాప్తంగా లోక్‌సభ, రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలను ఒకేసారి నిర్వహించడానికి ఉద్దేశించినది. అయితే విపక్షాలు దీనిపై తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నాయి. కొన్ని పార్టీలు ప్రజాస్వామ్య పద్ధతుల్లో సమస్యలు తలెత్తవచ్చని, ప్రాంతీయ అవసరాలు పూర్తిగా నీరుగారిపోతాయని ఆరోపిస్తున్నాయి.

 

 

 

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

ALSO READ  Hyderabad: మిస్ వరల్డ్ పోటీ నుంచి మిస్ ఇండియా ఔట్..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *