Supreme Court: పశ్చిమ గోదావరి జిల్లా ఆకివీడులో ప్రతిపాదిత శ్రీరామ ఆలయ నిర్మాణానికి ఉన్న అన్ని రకాల న్యాయపరమైన అడ్డంకులు తొలగిపోయాయి. ఆలయ నిర్మాణాన్ని సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్ను సుప్రీంకోర్టు కొట్టివేస్తూ తీర్పునిచ్చింది.
1. సుప్రీంకోర్టు కీలక తీర్పు
ప్రభుత్వ స్థలంలో నిబంధనల ప్రకారమే ఆలయ నిర్మాణం చేపడుతున్నారని, జిల్లా కలెక్టర్ ఇచ్చిన నిరభ్యంతర పత్రం (NOC) చట్టబద్ధమైనదేనని అత్యున్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. ఈ పిటిషన్లో ఎలాంటి బలం లేదని వ్యాఖ్యానిస్తూ, ఆలయ నిర్మాణానికి పూర్తి అనుమతి ఇచ్చింది.
2. భక్తుల ఆనందం.. డిప్యూటీ స్పీకర్ స్పందన
సుప్రీంకోర్టు తీర్పుపై స్థానికులు, రామభక్తులు తీవ్ర సంతోషం వ్యక్తం చేశారు. దీంతో త్వరలోనే ఆలయ నిర్మాణ పనులు వేగవంతం కానున్నాయి. ఈ తీర్పుపై ఏపీ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు సోషల్ మీడియా (X) వేదికగా స్పందించారు. “సత్యం గెలిచింది.. ధర్మం గెలిచింది.. శ్రీరాముడు గెలిచాడు.. జై శ్రీరామ్” అంటూ హర్షం వ్యక్తం చేశారు.
