Jubilee Hills: హైదరాబాద్ జూబ్లీహిల్స్లోని అత్యంత ఖరీదైన ప్రాంతంలో స్థలం కబ్జా యత్నం వివాదం కలకలం రేపింది. ఈ వ్యవహారంలో ప్రముఖ సినీ నిర్మాతలు సి. కళ్యాణ్, బురుగుపల్లి శివరామకృష్ణలతో పాటు మరికొందరిపై జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది.
1. వివాదానికి కారణమైన ప్లాట్ ఏది?
జూబ్లీహిల్స్లోని ఉమెన్స్ కో-ఆపరేటివ్ హౌసింగ్ సొసైటీ పరిధిలో ఉన్న ప్లాట్ నంబర్ 89 స్థలంపై కొద్దిరోజులుగా వివాదం నడుస్తోంది. ఈ స్థలానికి సంబంధించి ప్రస్తుతం కోర్టులో కేసు పెండింగ్లో ఉంది. జూన్ 10న కోర్టు రవిశంకర్ స్వాధీనంలో ఉన్న భూమి విషయంలో ఎలాంటి జోక్యం చేసుకోవద్దని తాత్కాలిక నిషేధాజ్ఞలు (స్టీ ఆర్డర్) జారీ చేసింది.
2. ఫిర్యాదులో ఉన్న ముఖ్యాంశాలు
రవిశంకర్ పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదు ప్రకారం నిందితులు దౌర్జన్యానికి పాల్పడినట్లు పేర్కొన్నారు..కోర్టు స్పష్టమైన ఉత్తర్వులు ఇచ్చి అమలులో ఉన్నప్పటికీ.. నిందితులు అక్రమంగా ఆ స్థలంలోకి ప్రవేశించారు. స్థలానికి ఉన్న తాళాలు పగులగొట్టి, ప్రధాన గేటును ధ్వంసం చేశారు. అంతేకాకుండా అక్కడున్న సామగ్రిని చెల్లాచెదురు చేసి, సిబ్బందిని తీవ్రంగా బెదిరించడమే కాకుండా అక్కడ నిర్మించిన గదిని కూల్చివేశారని రవిశంకర్ ఆరోపించారు.
3. దర్యాప్తు చేపట్టిన పోలీసులు
బాధితుడు రవిశంకర్ ఫిర్యాదును స్వీకరించిన జూబ్లీహిల్స్ పోలీసులు నిర్మాతలు సి. కళ్యాణ్, బురుగుపల్లి శివరామకృష్ణలతో పాటు వారి సహచరులపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఈ ఘటనపై విచారణ జరుపుతున్నట్లు పోలీసులు వెల్లడించారు.
