Sai Krishna Case: సాయికృష్ణ కేసులో ఆంధ్రప్రదేశ్ హైకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. ఈ కేసు విచారణను ప్రత్యేక దర్యాప్తు బృందానికే (SIT – సిట్) అప్పగించేందుకు న్యాయస్థానం మొగ్గు చూపింది. ఇప్పటివరకు ఈ కేసులో ఎలాంటి పురోగతి లభించింది, ఎలాంటి విచారణ జరిగింది అనే విషయాలపై పూర్తి నివేదికను సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించింది. రాబోయే మూడు వారాల్లోగా ఆ నివేదికను సీల్డ్ కవర్లో (రహస్యంగా) న్యాయమూర్తికి సమర్పించాలని కోర్టు స్పష్టం చేసింది.
అంతేకాకుండా, ప్రస్తుతం సాయికృష్ణ ఎక్కడ ఉన్నాడు? అతని అచూకీకి సంబంధించిన పూర్తి వివరాలను తదుపరి విచారణ సమయానికి ఖచ్చితంగా కోర్టుకు సమర్పించాలని దర్యాప్తు అధికారులకు గట్టి ఆదేశాలు జారీ చేసింది. ఈ సందర్భంగా విచారణ ప్రక్రియపై హైకోర్టు న్యాయమూర్తి ఒక ఆసక్తికరమైన వ్యాఖ్య చేశారు. రాష్ట్రంలో జరిగే ప్రతి కేసు వివరాలు లేదా దర్యాప్తునకు సంబంధించిన అన్ని విషయాలు డీజీపీ (DGP) వరకు వెళ్లాల్సిన అవసరం లేదని న్యాయమూర్తి స్పష్టం చేశారు.
