టై ముగిసిన ప్రధాన మ్యాచ్ – సూపర్ ఓవర్ హైడ్రా:
ఈ మ్యాచ్లో మొదట బ్యాటింగ్ చేసిన ఇండియా ‘ఎ’ జట్టు 49.2 ఓవర్లలో 265 పరుగులకు ఆలౌట్ అయింది. అనంతరం 266 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన శ్రీలంక ‘ఎ’ జట్టు సైతం 50 ఓవర్లలో సరిగ్గా 265 పరుగులకే పరిమితమైంది. దీంతో మ్యాచ్ టైగా ముగిసి సూపర్ ఓవర్కు దారితీసింది.
తిలక్ వర్మ వ్యూహాత్మక తప్పిదాలు – ఫ్యాన్స్ ఆగ్రహం:
17 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో కెప్టెన్ తిలక్ వర్మ తీసుకున్న నిర్ణయాలు అందరినీ ఆశ్చర్యపరిచాయి.
-
సీనియర్లను పక్కనబెట్టి: జట్టులో అంతర్జాతీయ అనుభవంతో పాటు ఐపీఎల్లో భారీ ఇన్నింగ్స్ ఆడిన అనుభవం ఉన్న రుతురాజ్ గైక్వాడ్, కెప్టెన్ తిలక్ వర్మ స్వయంగా ఉండగా.. సూపర్ ఓవర్ బ్యాటింగ్కు వైభవ్ సూర్యవంశీతో పాటు సూర్యాంశ్ షెడ్గేను పంపారు.
-
స్ట్రైకింగ్ బ్లండర్: సూర్యాంశ్ మెయిన్ మ్యాచ్లో 70+ పరుగులు చేసినప్పటికీ అతను స్పెషలిస్ట్ హిట్టర్ కాదు. అంతకంటే పెద్ద పొరపాటు ఏంటంటే.. సూర్యాంశ్ క్రీజులోకి రాగానే స్ట్రైక్ తీసుకున్నాడు. విధ్వంసకర ప్లేయర్ అయిన వైభవ్కు తొలి బంతి ఆడే అవకాశం ఇవ్వలేదు. ఫలితంగా సూర్యాంశ్ మొదటి 3 బంతుల్లో కేవలం 3 పరుగులు మాత్రమే చేసి ప్రెజర్ పెంచేసాడు. వైభవ్కు 4వ బంతికి స్ట్రైక్ వచ్చేసరికి మ్యాచ్ చేజారిపోయింది. అతను 3 బంతుల్లో 6 పరుగులు చేసినా ఫలితం లేకుండా పోయింది.
భారత్ ఓటమికి అసలు కారణాలు (Match Turning Points):
ఫైనల్ సమీకరణాలు – ఆఫ్ఘన్ చేతిలో భారత్ భవితవ్యం:
ఈ త్రిపాక్షిక (ట్రైయాంగులర్) సిరీస్లో భారత్ ప్రయాణం ఒడిదొడుకులతో సాగుతోంది. మొదటి మ్యాచ్లో లంకపై 8 రన్స్ తేడాతో గెలిచిన భారత్, ఆ తర్వాత ఆఫ్ఘనిస్తాన్ ‘ఎ’ జట్టు చేతిలో 4 పరుగుల తేడాతో ఓడింది. ఇప్పుడు మళ్లీ లంక చేతిలో పరాజయం పాలైంది.
దీంతో భారత్ నేరుగా ఫైనల్ చేరే అవకాశాన్ని కోల్పోయింది. ఇప్పుడు ఇండియా ‘ఎ’ ఫైనల్ చేరాలంటే.. రాబోయే మ్యాచ్ల్లో ఆఫ్ఘనిస్తాన్ జట్టు భారత్ చేతిలోనూ, ఆ తర్వాత శ్రీలంక చేతిలోనూ ఘోరంగా ఓడిపోవాలి. అప్పుడు మాత్రమే రన్ రేట్ ఆధారంగా తిలక్ సేనకు ఫైనల్ ఆడే ఛాన్స్ దక్కుతుంది.