Gold Price Today: బంగారం, వెండి కొనాలనుకునే వారికి కాస్త ఉపశమనం కలిగించే వార్త. గత కొద్దిరోజులుగా మండిపోయిన పసిడి ధరలకు ప్రస్తుతం కాస్త బ్రేకులు పడ్డాయి. వారం రోజులుగా పసిడి ధరలు క్రమంగా దిగివస్తున్నాయి. గత నాలుగు రోజుల్లోనే తులం బంగారంపై రెండు వేల రూపాయలకు పైగా ధర తగ్గడం గమనార్హం. ప్రస్తుతం దేశీయంగా తులం బంగారం ధర రూ.1,56,210 వద్ద కొనసాగుతోంది. అలాగే కిలో వెండి ధర రూ.2,90,000 వద్ద ట్రేడవుతోంది.
తెలుగు రాష్ట్రాలైన హైదరాబాద్, విజయవాడల్లో ఈరోజు ధరలు చూస్తే.. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,56,210 గా ఉండగా, 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,43,190 వద్ద కొనసాగుతోంది. ముంబై, బెంగళూరు, కోల్కతా, కేరళ ప్రాంతాల్లో కూడా ఇవే ధరలు నమోదయ్యాయి. దేశ రాజధాని ఢిల్లీలో 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,56,360 గా, 22 క్యారెట్ల ధర రూ.1,43,340 గా ఉంది. ఇక చెన్నైలో మాత్రం పసిడి ధర కాస్త ఎక్కువగా ఉంది. అక్కడ 24 క్యారెట్ల తులం బంగారం ధర రూ.1,60,090 కాగా, 22 క్యారెట్ల ధర రూ.1,47,490 వద్ద ట్రేడవుతోంది.
అయితే ఈ ధరలన్నీ ఉదయం 6 గంటలకు నమోదైనవి మాత్రమేనని గమనించాలి. అంతర్జాతీయ మార్కెట్ పరిస్థితులను బట్టి రోజులో ఈ ధరలు పెరగవచ్చు, తగ్గవచ్చు లేదా స్థిరంగానూ ఉండవచ్చు. వీటికి అదనంగా జీఎస్టీ, మేకింగ్ చార్జీలు కూడా తోడవుతాయి కాబట్టి వివిధ నగరాల్లో ధరల్లో కొద్దిగా తేడాలు ఉంటాయి. అందువల్ల భక్తులు, వినియోగదారులు కొనుగోలు చేసే సమయానికి ఖచ్చితమైన రేటు ఎంతో తెలుసుకోవడం మంచిది. అలాగే మీరు కొనే బంగారంపై తప్పనిసరిగా ‘హాల్మార్క్’ ముద్ర ఉందో లేదో చూసుకోవడం అస్సలు మర్చిపోకండి.
