B-Tech Student Rape: హైదరాబాద్ పరిధిలోని ఇబ్రహీంపట్నం పోలీస్స్టేషన్ పరిధిలో తోటి విద్యార్థినిపై ఓ ఇంజినీరింగ్ విద్యార్థి అత్యాచారానికి పాల్పడిన దారుణ ఘటన వెలుగుచూసింది. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్కు చెందిన ఉడుతల ఉదయ్ అనే యువకుడు తనతో పాటు చదువుకుంటున్న క్లాస్మేట్పై ఈ అఘాయిత్యానికి ఒడిగట్టాడు. బాధితురాలి ఫిర్యాదు మేరకు ఇబ్రహీంపట్నం పోలీసులు కేసు నమోదు చేసి నిందితుడిని సోమవారం అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు.
టీ తాగుదామని కారులో తీసుకెళ్లి..
పోలీసుల కథనం ప్రకారం.. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్కు చెందిన ఉడుతల ఉదయ్, రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం పరిధిలోని ఒక ఇంజినీరింగ్ కళాశాలలో బీటెక్ మూడో సంవత్సరం చదువుతున్నాడు. ఈ క్రమంలో, ఈ నెల 14న రాత్రి తన క్లాస్మేట్ అయిన ఒక యువతిని టీ తాగడానికి తాగడానికి వెళ్లారు. ఇద్దరూ కలిసి కారులో దిల్సుఖ్నగర్కు వెళ్లారు. అక్కడ టీ తాగిన అనంతరం తిరిగి ఇబ్రహీంపట్నం వస్తున్న సమయంలో ఉదయ్ మార్గమధ్యంలో మద్యం కొనుగోలు చేశాడు.
మద్యం తాగించి గదిలో అఘాయిత్యం
దిల్సుఖ్నగర్ నుంచి వస్తుండగా.. ఉదయ్ తన కారును ఇబ్రహీంపట్నం సమీపంలోని బీడీఎల్ (BDL) రోడ్డులో ఉన్న ఒక నిర్మానుష్య ప్రదేశంలోకి తీసుకెళ్లాడు. అక్కడ సదరు విద్యార్థినికి బలవంతంగా మద్యం తాగించాడు. పూర్తిగా మత్తులోకి జారుకున్న యువతిని రాత్రి సమయంలో ఇబ్రహీంపట్నంలోని ఒక గదికి తీసుకువెళ్లాడు. అనంతరం మత్తులో ఉన్న యువతిపై ఉదయ్ అక్కడ అత్యాచారానికి పాల్పడ్డాడు.
పోలీసుల వేగవంతమైన చర్యలు
ఈ దారుణ ఘటన జరిగిన తర్వాత తీవ్ర దిగ్భ్రాంతికి, మనస్తాపానికి గురైన బాధితురాలు ఈ నెల 17న ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్లో నిందితుడిపై ఫిర్యాదు చేసింది. కేసు తీవ్రతను పరిగణనలోకి తీసుకున్న ఇబ్రహీంపట్నం సీఐ మహేందర్రెడ్డి తక్షణమే స్పందించి దర్యాప్తు చేపట్టారు. నిందితుడు ఉడుతల ఉదయ్ను సోమవారం నాడు పోలీసులు అదుపులోకి తీసుకుని అరెస్ట్ చేశారు. అనంతరం నిందితుడిని కోర్టులో హాజరుపరచగా న్యాయమూర్తి రిమాండ్ విధించడంతో జైలుకు తరలించారు.
