HIYYA Dino Mandi Restaurant

HIYYA Dino Mandi Restaurant: హీరో మంచు మనోజ్ చేతుల మీదుగా హియ్య డైనో మండి రెస్టారెంట్ గ్రాండ్ లాంచ్

HIYYA Dino Mandi Restaurant: హైదరాబాద్ భోజన ప్రియుల రుచిని మరింత పెంచేందుకు హియ్య డైనో మండి రెస్టారెంట్ ప్రారంభం అయింది. తాజాగా కూకట్ పల్లిలోని జీపీఆర్ మల్టీప్లెక్స్ ఫస్ట్ ఫ్లోర్ లో హియ్య డైనో మండి రెస్టారెంట్ గ్రాండ్ లాంచ్ ఈవెంట్ జరింగింది. హీరో మంచు మనోజ్ చేతుల మీదుగా ఈ రెస్టారెంట్ ఘనంగా ప్రారంభం అయింది. ఈ కార్యక్రమంలో హీరో మంచు మనోజ్, ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ, యాంకర్ సుమ కనకాల, గౌతమి చౌదరి, గౌతమ్, విక్రాంత్, రాజేష్, భావన, ఇన్ ఫ్ల్యూయోన్సర్స్, సెలబ్రెటీలు, ప్రముఖులు పాల్గొన్నారు.

సుమా కనకాల మాట్లాడుతూ.. ఇప్పటికే హియ్య మండి చాలా పాపులర్.. ఇప్పుడు డైనో అనే మరో కాంబినేషన్ తో రావడం బాగుందన్నారు. ఫుడ్ తో పాటు యాంబియెన్స్ బాగుంటేనే జనాలు వస్తున్నారు. ఈ విషయంలో హియ్య డైనో మండి రెస్టారెంట్ సక్సెస్ అయిందన్నారు. ఒక డైనోసర్ సెటప్ లో ఈ మండి ఉండడం చాలా ఆసక్తికరంగా ఉందన్నారు. ఈ మండికి వచ్చే భోజన ప్రియులు ఈ యాంబియెన్స్ చూసి ఆశ్చర్యపోతారు అని తెలిపారు. ముఖ్యంగా కుటుంబంతో సహా వచ్చే వారికి, చిన్న పిల్లలకు ఈ రెస్టారెంట్ చాలా బాగా నచ్చుతుందన్నారు. ఒక సారి వస్తే మళ్లీ మళ్లీ రావాలనిపిస్తుది అనే తెలిపారు. ఇలాంటి అద్భుతమైన రెస్టారెంట్ ను మొదలు పెట్టిన గౌతమి చౌదరి, గౌతమ్, విక్రాంత్ లకు శుభాకాంక్షలు తెలిపారు.

మంచు మనోజ్ మాట్లాడుతూ.. గౌతమి చౌదరి, గౌతమ్, విక్రాంత్ ఫ్రెండ్స్. ఈ ఫ్రెండ్స్ కలిసి మొదలు పెట్టిన ఈ రెస్టారెంట్ ప్రారంభించడం చాలా బాగుందన్నారు. ఇలాంటి క్రియేటీవ్ ఆలోచనలతో రెస్టారెంట్ పెట్టడం చాలా సంతోషంగా ఉందన్నారు. ముఖ్యంగా చిన్నపిల్లలకు, ఫ్యామిలీలకు బాగా నచ్చుతుందని అన్నారు. కచ్చితంగా హైదరాబాద్ లో ఉన్న వారు హియ్య డైనో మండిని ఒకసారి ట్రై చేయమని తెలిపారు.

ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ మాట్లాడుతూ.. కొత్త కాన్సెప్ట్ లో హియ్య డైనో మండిని స్థాపించడం చాలా సంతోషంగా ఉందన్నారు. హోటల్ రంగంలో రాణించడం అంటే చాలా ఓపిక ఉండాలి. హియ్య రెస్టారెంటులు వైజాగ్, నాగపూర్, మాదాపూర్, ఇప్పుడు కూకట్ పల్లిలో స్థాపించడం, విజయంతో ముందుకు వెళ్లడం అంటే మంచి విషయం అని పేర్కొన్నారు. ముఖ్యంగా పిల్లలు ఎంజయ్ చేసే విధంగా, కుటుంబాలు కూడా ఆహ్లాదకరంగా ఉండేలా ఇలాంటి వాతావరణంలో రెస్టారెంట్ ను ప్రారంభించడం బాగుందన్నారు. కేవలం బిజినెస్ చేయడమే కాదు వందల మందికి ఉపాది కల్పిస్తున్న హియ్య టీమ్ కు శుభాకాంక్షలు తెలిపారు.

గౌతమి చౌదరి మాట్లాడుతూ.. హియ్య డైనో రెస్టారెంట్ ఓపెనింగ్ కు వచ్చిన సుమా, మంచు మనోజ్, అరికెపూడి గాంధీకి ధన్యవాదాలు తెలిపారు. పిల్లలను, ఫ్యామిలీలకు మంచి వాతావరణంలో మంచి భోజనం అందించాలనే ఆలోచన నుంచి పుట్టిందే ఈ డైనో మండి అని చెప్పారు. త్వరలోనే అమిర్ పేట్ లో హియ్య స్పేస్ మండిని ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. ఇక హియ్య మండి పార్టనర్స్ కూడా చాలా సంతోషాన్ని వ్యక్తం చేశారు. గౌతమ్ మాట్లాడుతూ.. చాలా సంతోషంగా ఉందన్నారు. పిలువగానే వచ్చినందుకు మంచు మనోజ్, అరికెపూడి గాంధీ, సుమకు థ్యాంక్స్ చెప్పారు. హియ్య మండిలను ఆదరిస్తున్న జనాలకు థ్యాంక్స్ చెప్పారు. మంచి రెస్పాన్స్ వస్తుందని తెలియజేశారు. ఫుడ్ బిజెనెస్ అంటే కేవలం డబ్బులు సంపాదించడమే లక్ష్యం కాదు, రుచికరమైన ఆహారాన్ని అందించడమే మా లక్ష్యామని చెప్పారు.

విక్రాంత్ మాట్లాడుతూ.. హియ్య మండి బ్రాంచేస్ ఎక్కడ పెట్టినా అద్భుతమైన స్పందన వస్తుందని అందుకు చాలా సంతోషంగా ఉందన్నారు. కేవలం మూడు నెలలలో మరో మండిని ఓపెన్ చేయడం అంటే చాలా సంతోషంగా ఉందన్నారు. ఈ కార్యక్రమానికి విచ్చేసిన అతిథులందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *