Anagani: మంత్రి అనగాని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధి, స్వచ్ఛత కార్యక్రమాలపై కీలక వ్యాఖ్యలు చేశారు. జగన్ పాలనలో రాష్ట్రం అప్పుల్లో కూరుకుపోయిందని, చెత్త నిర్వహణ కూడా నిర్లక్ష్యం చేయబడిందని విమర్శించారు. ప్రస్తుతం ప్రభుత్వం చేపడుతున్న స్వచ్ఛాంధ్ర కార్యక్రమంతో రాష్ట్రాన్ని పూర్తిగా మార్చేస్తామని ఆయన తెలిపారు.
చెత్త నిర్వహణ విషయంలో ఆధునిక విధానాలు అమలు చేస్తున్నామని మంత్రి చెప్పారు. తడి చెత్త, పొడి చెత్తను వేరు చేసి రీసైక్లింగ్కు పంపిస్తున్నామని, అలాగే చెత్తను రేపల్లెలోని విద్యుత్ ప్లాంట్కు తరలించి విద్యుత్ ఉత్పత్తికి వినియోగిస్తున్నామని వివరించారు. దీనివల్ల పర్యావరణ పరిరక్షణతో పాటు శక్తి ఉత్పత్తి కూడా జరుగుతుందని పేర్కొన్నారు.
అలాగే రాష్ట్ర అభివృద్ధిపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మంత్రి లోకేష్ ప్రత్యేక దృష్టి పెట్టారని అనగాని అన్నారు. విశాఖపట్నాన్ని ఐటీ హబ్గా మార్చే దిశగా చర్యలు తీసుకుంటున్నామని, పెట్టుబడులు, కంపెనీలు ఆకర్షించేలా విధానాలు అమలు చేస్తున్నామని చెప్పారు.
