Yogi Adityanath:

Yogi Adityanath: తొక్కిస‌లాట ఘ‌ట‌న‌పై స్పందించిన‌ సీఎం యోగి ఆదిత్య‌నాథ్‌

Yogi Adityanath:ఉత్త‌ర‌ప్ర‌దేశ్ రాష్ట్రంలోని ప్ర‌యాగ‌రాజ్ మ‌హా కుంభ‌మేళాలో జ‌రిగిన తొక్కిస‌లాట ఘ‌ట‌న‌పై ఆ రాష్ట్ర ముఖ్య‌మంత్రి యోగి ఆదిత్య‌నాథ్ స్పందించారు. ఈ ఘ‌ట‌న‌లో 15 మంది భ‌క్తులు మృత్యువాత ప‌డ‌గా, సుమారు 50 మందికి పైగా భ‌క్తులు గాయాల‌పాల‌య్యారు. త్రివేణి సంగ‌మంలోని రెండో సెక్టార్ వ‌ద్ద ఈ తొక్కిస‌లాట చోటుచేసుకున్న‌ది.

Yogi Adityanath:మ‌హాకుంభ‌మేళాలో పాల్గొనేందుకు ప్ర‌యాగ‌రాజ్‌కు ఇప్ప‌టివ‌ర‌కు సుమారు 10 కోట్ల మందికి పైగా భ‌క్తులు త‌ర‌లివ‌చ్చారని యోగి ఆదిత్య‌నాథ్ తెలిపారు. నిన్న ఒక్క‌రోజే 5 కోట్ల మంది ప‌విత్రస్నానాలు ఆచ‌రించార‌ని తెలిసింద‌ని చెప్పారు. అర్ధ‌రాత్రి దాటాక మౌని అమావాస్య ఘ‌డియ‌లు రాగానే భ‌క్తులు ఒక్క‌సారిగా బారికేడ్ల ముందుకు వ‌చ్చార‌ని సీఎం తెలిపారు. ఈ స‌మ‌యంలోనే తొక్కిస‌లాట జ‌రిగింద‌ని వివ‌రించారు.

Yogi Adityanath:తొక్కిస‌లాట చోటుచేసుకోగానే అధికారులు, సిబ్బంది వెంట‌నే స్పందించి స‌హాయ‌క చ‌ర్య‌లు చేప‌ట్టార‌ని సీఎం యోగి ఆదిత్య‌నాథ్ తెలిపారు. ప్ర‌స్తుత పరిస్థితి నియంత్ర‌ణ‌లోనే ఉన్న‌ద‌ని చెప్పారు. వదంతుల‌ను న‌మ్మొద్ద‌ని, స‌మీపంలోని ఘాట్‌ను ఉప‌యోగించుకొని ప్ర‌జ‌లు స‌హ‌క‌రించాల‌ని యోగి ఆదిత్య‌నాథ్ కోరారు.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

ALSO READ  Cold Water: చల్లటి నీటిని తాగుతున్నారా..? అయితే జాగ్రత్త..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *