Women Protest

Women Protest: మిషన్ భగీరథ నీటి కోసం మహిళల నిరసన

Women Protest: కొమురం భీం జిల్లా చింతలమానేపల్లి మండలంలోని డబ్బా గ్రామంలో మహిళలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. గత రెండు వారాలుగా మిషన్ భగీరథ నీరు రాకపోవడంతో, త్రాగునీటి సమస్యతో వారు ఆందోళనకు దిగారు.

ఖాళీ బిందెలతో రోడ్డెక్కిన మహిళలు
నీటి సమస్యపై గ్రామ అధికారులు పట్టించుకోకపోవడంతో ఆగ్రహించిన మహిళలు, తమ నిరసనను వినూత్నంగా తెలిపారు. డబ్బా-ధరంపల్లి ప్రధాన రహదారిపై ఖాళీ బిందెలతో వచ్చి ఆందోళన చేశారు. ఈ ఆందోళన వల్ల రోడ్డుకు ఇరువైపులా వాహనాలు భారీగా నిలిచిపోయాయి.

అధికారుల స్పందన కోసం ఎదురుచూపు
రెండు వారాలుగా నీరు రాక తమ రోజువారీ జీవితం కష్టమైందని, వెంటనే అధికారులు స్పందించి నీటి సరఫరాను పునరుద్ధరించాలని మహిళలు డిమాండ్ చేశారు. స్థానిక అధికారులు ఈ సమస్యపై ఎలా స్పందిస్తారో చూడాలి.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *